Friday, March 23, 2012

రాగి విరాగి 
ప్రతి మనిషి తాను సుఖంగా, ఆనందంగా వుండాలని భావిస్తాడు. ప్రస్తుతం వున్నా స్థితి కన్నా ఇంకా మెరుగుగా సుఖపడాలని ఆనందపడాలని కోరుకోవటం సహజం.  తాను ఈ ప్రపంచంలో దొరికే ఆనందాల వైపు పరుగులు తీస్తాడు ఈ జీవితంలో తాను సుఖ పడటానికి  ఇంకా ఏమి లేదు అన్నప్పుడు ఇంకా ఏదో వుండాలి అన్న ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే పూర్ణత్వం వైపు నడిపిస్తుంది.  అదే వేదాంతపు మొదటి మెట్టు వేదాంతం నుంచే వైరాగ్యం పుడుతుంది.  వైరాగ్యం  ఆ ఫై స్థితి  బ్రహ్మత్వపు దిశగా నడిపిస్తుంది.  బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి వక మంచి గురువు కావాలి.  మరి ఆ గురువును తెలుసుకోటం ఎలా ?  ప్రతి మనిషిని నిత్యం వేదిస్తున్నసమస్య యిది. ఒక మంచి సద్గురువు దొరకటం మన పూర్వ జన్మ సుకృతము.  ఆలోచన వుంటే అవకాశము దొరుకుతుంది.  

ఈ రోజ్జుల్లో మనకు చాలామంది మేము జ్ఞ్యనులము బ్రహ్మర్షులము మీకు జ్ఞ్యన బోధ చేస్తాము.  మాకు ఈ ఫీజు కట్టండి ఆ కానుకలు సమర్పించండి అని ప్రకటనలను ఇస్తున్నారు.  మీరు వాళ్ళ వెంట వెళ్ళవద్దు నిజమైన గురువుకి వక్కటే పరీక్ష. 
బాబాలతో జాగ్రత్త: ఈ రోజుల్లో బాబాల ప్రభావం చాల వున్నది.  కొంత మంది తాము షిరిడి సాయి తో మాట్లాడుతామని మీ బాధలు మాకు (నాకు) చెప్పండి నేను బాబాతో మాట్లాడుతాను మీరు ఈ ఫి కట్టండి ఆ ఫి కట్టండి అని మన అమాయకత్వం ఆసరాగా ఎంతోధనం సంపాదించే ఒక దొంగ బాబాను నేను చూసాను.  బహుశా మీకు తారస పడ వచ్చు.  మీరు షిరిడి సాయి, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, రామకృష్ణ పరమ హంస, వివేకా నంద ఇంకాఎంతో మంది ఇలాంటి యోగ పురుషులని వారు దేముడ్లు అని భావించి వారి చిత్ర పాటలని పెట్టుకొని పూజించటం వాళ్ళ గుడులకి వెళ్లి మొక్కుకోవటం చూస్తున్నాము.  నిజానికి వాళ్ళు దేముడులు కాదని తెలుసుకోండి, వాళ్ళు మనలాగా యోగ సాధన చేసిన వాళ్ళు మాత్రమే.  మీకు ఒకవేళ మీ యోగ సాధనలో వాళ్ళు కనపడితే తబిబై మీరు ఏదో సాదిన్చానని భావించకండి. కేవలం వాళ్ళు మనలాగా సాధకులు మాత్రమే అంటే మన సీనియర్స్.  ఎప్పటికి సీనియర్ టీచర్ కాలేడు తెలుసుకోండి.   ఒక పుస్తకంలో స్వామి వివేకానంద స్వయంగా వ్రాసారువాళ్లంతా కేవలం దయ్యాలు మాత్రమే కాకపోతే మంచి దయ్యాలు.  మన లక్ష్యం ఆ అద్వితీయ పరాత్పరుని చేరటం.  అంతే కానీ ఈ దయ్యాల వెంట పడటం కాదు.  మీరు సాధన అకుంటిత దీక్షతో చేస్తేవాళ్ల కన్నా ఎన్నో రేట్లు ముందుకు పోతారు.  ఈ జన్మ పూర్తిగా మనం సాధనచేసినా మన గమ్యం చేరుకో లేక పోవచ్చు కానీ మన సాధన మాత్రం ఆపకూడదు మనం ఆ దేవ దేవుడిని కోరుకోవలసింది ఏమంటే ఈ జన్మ పూర్తిగా సాధన చేయటానికిఅవకాశం ఇవ్వమని. అంతేకాదు వచ్చే జన్మ కూడా సాధన నిరంతరాయంగా సాగాలని కోరుకోవాలి. కృష్ణ భగవానుడు ఈ విషయంలో స్పష్టంగా చెప్పాడు.  యోగ బ్రష్టుడు తదుపరి జన్మలో తన యోగ సాధన కొనసాగిస్తాడు అని.  కాబట్టి ఈ జనన మరణాల గూర్చు మనం విచారించ పనిలేదు.  సాధన, సాధన అదే మన జీవన లక్ష్యం  అంతే.  
సద్గురువు కోసం అన్వేషణ:  సద్గురువు ఎప్పటికి ఈ ఐహిక వాంఛలతో ఉండడు  తనకి ఏది ఇచ్చిన తిసుకోడు మీ నుండి ఏదో ఆశించి మీకు ప్రభోదచేయడు  కేవలము నిత్యం భ్రహ్మ్మంలోనే సంచరిస్తూ వుంట్టాడు ఈ ప్రపంచంలో  ఏది కూడా కోరాడు అన్ని తనకు  తృణ ప్రాయంగా తోస్తాయి.  ఈ బౌతిక సమాజాన్ని పట్టించుకోడు.  అవమాన, సన్మానాలను సమానంగా చూస్తాడు.  ఎవరిమీద వ్యామోహం కానీ, హేయం కానీ కలిగి ఉండడు.  అటువంటి గురువు లబించటం చాల అరుదు    మీకు అటువంటి గురువు తారస పడితే వెంటనే అతనికి పాదాభివందనం చెయ్యండి 

ఇంకా వుంది 

No comments: