Monday, August 24, 2020

విగ్రహం సొంతంగా పెరగడం


ఆశ్చర్యపోనవసరం లేదు, నిజం ఏమిటంటే గోడపై ఉన్న విగ్రహం సొంతంగా పెరగడం ప్రారంభించి ప్రసిద్ధ గణపతి ఆలయంగా మారింది
   మాధుర్ మహాగనాపతి ఆలయం, కేరళ

శివ-పార్వతి నందన్ గణపతి గురించి మనమందరం చాలా కథలు చదివి విన్నాం. కానీ ఇక్కడ మనం వాటికి భిన్నంగా ఉన్న ఆలయం గురించి మాట్లాడుతున్నాము. ఈ ఆలయంలో  విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు, కానీ ఇక్కడ అది గోడ నుండి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక ఆలయం

ఈ ఆలయం మధురవాహిని ఒడ్డున ఉంది

మాధుర్ ఆలయం యొక్క పురాణాలు
మాధుర్ ఆలయం మొదట శివాలయం మరియు అతను ఈ ఆలయానికి ప్రధాన భగవాన్ శివుడు  మాత్రమే. పురాణాల ప్రకారం, స్వయంగా వ్యక్తమయ్యే శివలింగాన్ని 'మాధారు' అనే వృద్ధ మహిళ కనుగొంది. అందువల్ల ఈ ఆలయం మాధుర్ ఆలయంగా ప్రసిద్ది చెందింది.

మరో పురాణం మాధుర్ ఆలయంలోని గణేశ విగ్రహం గురించి. ఒక చిన్న బ్రాహ్మణ కుర్రాడు ఆలయ గోడపై ఒక చిన్న గణేశ చిత్రాన్ని చెక్కాడని చెబుతారు. తరువాత, అది పెరిగి గణేశుడి పెద్ద విగ్రహంగా మారింది. బాలుడు అతన్ని బొడ్డజ్జా లేదా బొడ్డ గణేశ అని పిలవడం ప్రారంభించాడు. తరువాత, ఈ విగ్రహానికి మదనాంతేశ్వర సిద్ధి వినాయక అని పేరు పెట్టారు
అప్పుడు గణపతి పరిమాణం పెరగడం ప్రారంభమైంది

మాధుర్ మహాగణపతి ఆలయం కేరళలోని కాసరగోడ్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మొగ్రాల్ అనగా మధువాహని నది ప్రవహిస్తుంది.

ఆలయ గర్భగుడి గోడపై చేసిన గణపతి ఆకారం క్రమంగా దాని పరిమాణాన్ని పెంచడం ప్రారంభించిందని చెబుతారు. క్రమంగా  చాలా పెద్దదిగా పెరిగింది. అప్పటి నుండి, ఈ ఆలయం గణేశుడి ప్రత్యేక ఆలయంగా ప్రసిద్ది చెందింది.

ఆలయ చెరువు ఔషధ లక్షణాలతో నిండి ఉంది

మాధుర్ ఆలయ చరిత్ర
చరిత్రలో ఒక రికార్డు టిప్పు సుల్తాన్ కాసరగోడ్ మరియు మాధుర్ ఆలయంపై దాడి గురించి మాట్లాడుతుంది. స్థానిక చరిత్ర ప్రకారం టిప్పు సుల్తాన్ మాధుర్ ఆలయాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆలయ ప్రవాహం (మధువహిని) దగ్గర ఉండగా, నీళ్ళు తాగాడు, అకస్మాత్తుగా ఆలయానికి నష్టం జరగకుండా తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు.

మాధుర్ ఆలయంలో శివ మరియు గణేశుడి మందిరం ఉంది. ఇది 'గజా ప్రిస్టా' (ఏనుగు వెనుకభాగాన్ని పోలి ఉంటుంది) శైలిలో నిర్మించిన మూడు అంచెల భవనం. అందమైన నిర్మాణం ఈ ప్రదేశానికి చాలా మందిని ఆకర్షిస్తుంది. ఇక్కడ గణేశుడికి ప్రార్థనలు చేసేటప్పుడు ప్రసిద్ధ స్థానిక వంటకం 'అప్పా' అందిస్తారు. 'మూడప్పం' - (గణేశుడు 'అప్పా' ధరించి)

శివుడు ప్రధాన దేవత అయినప్పటికీ, ఈ ప్రదేశం గణేశ ఆలయానికి ప్రసిద్ధి చెందింది
గణపతిని పూజించడం వల్ల బుధవారం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసు

 గణేశుడి విగ్రహం తీపి బియ్యం, నెయ్యి మిశ్రమంతో కప్పబడి ఉంటుంది.
   * కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.

* కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.

* మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

ఓం గం గణపతయే నమః
*****************

వరాహ జయంతి*

భగవంతుడు దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు అవసరమైనప్పుడు లోకంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలా అవతరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైన అవతారాలు పది. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అనే పేర్లతో దశావతారాలు ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నాయి.

దశావతారాల్లో మూడోదైన వరాహావతారం హిరణ్యాక్షుడి చెర నుంచి భూమిని రక్షించడానికి సంభవించిందని పురాణేతిహాసాలు వివరిస్తున్నాయి. పూర్వం దితి కుమారుడు, హిరణ్యకశిపుడి సోదరుడు అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు అహంకారంతో చెలరేగిపోయి భూమిని పాతాళానికి తోసివేశాడు. తన అన్నను చంపిన విష్ణువు అంటే ఇతడికి ద్వేషం. ఆ కారణంగా విష్ణువును వధించాలని వైకుంఠానికి వెళ్తూ ఉండగా, దారిలో నారదుడు ఎదురయ్యాడు. విష్ణువు ఇప్పుడు వైకుంఠంలో లేడని, యజ్ఞవరాహ రూపంలో పాతాళంలో ఉన్నాడని నారదుడు హిరణ్యాక్షుడికి చెప్పాడు. అప్పుడు హిరణ్యాక్షుడు విష్ణువును వెదుకుతూ పాతాళానికి వెళ్లాడు. అక్కడ వరాహరూపంలో ఉన్న విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడు. వరాహరూపంలో ఉన్న విష్ణువు తన వాడి అయిన కోరలతో కుమ్ముతూ ఆ దుష్టరాక్షసుణ్ని వధించాడు. అనంతరం పాతాళంలో పడివున్న భూమిని తన పంటికొసపై ఉద్ధరించి, పైకి తెచ్చి కాపాడాడు. భూదేవికి హిరణ్యాక్షుడి పీడ తొలగిపోయింది. దేవతలు సంతోషించారు. భూలోకవాసులు ఆనందించారు. వరాహమూర్తి అనుగ్రహంతో స్వాయంభూ వసువు భూలోకాన్ని ధర్మబద్ధంగా పాలించాడు. జగత్కల్యాణం కోసం మహావిష్ణువు వరాహరూపంలో అవతరించిన ఈ పవిత్ర దినాన ‘వరాహ జయంతి’ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆచారంగా మారింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష తృతీయనాడు వరాహక్షేత్రాల్లో వైభవంగా వరాహ జయంతిని నిర్వహించడం, భక్తులు ఒక పర్వదినంగా పూజలు చేయడం పరిపాటి. కొందరు చైత్రబహుళ త్రయోదశినాడు వరాహజయంతిని నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని ఆచారాలను, సంప్రదాయాలనూ అనుసరించి ఈ వైవిద్యం ఉంటుంది.

వరాహావతార వైశిష్ట్యాన్ని తెలిపే వరాహ పురాణంలో కలియుగార్చావతారుడైన శ్రీ వేంకటేశ్వరుడికి తిరుమలలో నివాసస్థలం ఇచ్చింది వరాహస్వామేనన్న ప్రశస్తి ఉంది. అందుకే నేటికీ తిరుమలను వరాహక్షేత్రం అని పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవడానికి ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలనే నియమం కూడా ఉంది. స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన వరాహస్వామి ఆలయం తిరుమలకు వెళ్లే యాత్రికులకు ప్రథమ పూజ్యస్థానం.

కోరలతో నేలను తవ్వుకుంటూ వెళ్లే వరాహం మానవుడికి కృషీవలత్వాన్ని బోధిస్తోంది. నేలను తవ్వి, సాగుచేసి, రత్నాల వంటి పంటలు పండించాలని చెబుతోంది. అవసరమైతే పంటికోరలపై భూమిని మోసినట్లు, భారాన్ని మోయాలని ప్రబోధిస్తోంది. ఆపదలో మునిగిపోయినవారిని లోతుల్లోకి వెళ్లి రక్షించాలని మార్గదర్శనం చేస్తోంది. మహిమ గల వరాహస్వామి ఎందరికో ఆరాధ్య దైవమై ఈ భూమండలంలోని అనేక క్షేత్రాలలో కొలువుదీరి ఉన్నాడు. వరాహస్మరణం సకల పాపహరమే కాకుండా, విశ్వకల్యాణకారకం కూడా!
*********************

చికిత్స అంటే..-- విజ్ఞన వీచిక

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో             బాధ పడుతు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా  చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు)     *ఎక్మో*  ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).               
*ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో*
*ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో  ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి...

*ఎక్మో’* ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున్నా.. వాస్తవానికి ఈ విధానం కొంత కాలంగా మన దేశంలో అందుబాటులో ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో అయితే చాలా విస్తృతంగా కూడా వాడకంలో ఉంది. కీలక ఘడియల్లో మన వూపిరితిత్తుల పనినీ, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి... మన దేహాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. అందుకే దీనికి ఇంతటి ప్రాధాన్యం!

వెంటిలేటర్ల గురించి మన దేశంలో దాదాపుగా అందరికీ తెలుసు. రోగి శ్వాస పీల్చుకోలేకపోతున్న తరుణంలో... బయటి నుంచి ఆక్సిజన్‌ను ఇచ్చి.. రోగిని బతికించే కీలకమైన విధానం ఇది. అయితే రోగి వూపిరితిత్తులు కొంతైనా బాగా పని చేస్తున్నప్పుడే ఈ విధానం పనికొస్తుంది. కానీ రోగి వూపిరితిత్తులు కూడా సరిగా పని చేయక.. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో.. రోగి ప్రాణ రక్షణ కోసం అక్కరకొచ్చే అత్యాధునిక విధానమే ‘ఎక్మో’!

ఎందుకీ ఎక్మో?
రక్తం.. మన శరీరంలోని ప్రతి కణానికీ అవసరం. మన శరీరంలో ప్రతి కణానికీ ప్రాణవాయువును మోసుకుపోయే అద్భుత శక్తి ప్రవాహం ఇది!
అందుకే రక్తం సజావుగా, నిరంతరాయంగా అందుతుంటేనే మన ఒంట్లోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటూ... వాటి పని అవి సమర్థంగా చేసుకుపోతుంటాయి. ఒకవేళ ఏదైనా కారణాన రక్త సరఫరా నిలిచిపోతే.. ఆ కణాలు చచ్చిపోతాయి, అవయవాలు పనితీరు అస్తవ్యస్తమై క్రమేపీ నిర్జీవమైపోతాయి. మృత్యువు ముంచుకొచ్చేస్తుంది. మన శరీరంలో రక్తసరఫరాకు అంతటి కీలకమైన ప్రాధాన్యం ఉంది.

ఇంతటి కీలకమైన రక్తాన్ని మన శరీరమంతా సరఫరా చేసేది- గుండె!
ఈ రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తుండేది- మన వూపిరితిత్తులు!!
అందుకే ఈ రెండింటినీ మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలుగా చెప్పుకోవాలి. వూపిరిత్తిత్తులు సరిగా పనిచేయకపోతే రక్తం శుద్ధి ప్రక్రియ జరగదు. దీంతో ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంటుంది, ఆక్సిజన్‌ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, వూపిరితిత్తులూ.. రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం.

ఒకవేళ...
ఎవరికైనా ఈ రెండూ విఫలమైపోతే అప్పుడు ప్రాణ రక్షణ కోసం ఏం చెయ్యాలి? వూపిరితిత్తులు బాగానే పని చేస్తుంటే వెంటిలేటర్‌ మీద పెట్టి, ప్రాణాలను కాపాడొచ్చు. కానీ అవి కూడా పని చేయకపోతే.. ఆ వూపిరితిత్తులు చేసే పనినే బయట యంత్రాలతో చేయించే అద్భుతమైన చికిత్సా విధానం.. ఇప్పుడు ‘ఎక్మో’ రూపంలో అందుబాటులోకి వచ్చింది.

‘ఎక్మో’.. చేసేదేమిటి?
రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకువచ్చి.. ఒక యంత్రంలో దాన్ని శుద్ధి చేసి.. ఆ మంచి రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తుండటం ఈ విధానం ప్రత్యేకత. అంటే వూపిరితిత్తులు చేసే పనీ, గుండె చేసే పనీ.. రెంటినీ ఈ యంత్రమే, అదీ బయటే చేస్తుందన్న మాట.

ఇలా ఎంత కాలం చెయ్యొచ్చు?
వాస్తవానికి గుండెకు ఆపరేషన్‌ చేసే సమయంలో కొన్నిసార్లు గుండెను, వూపిరితిత్తులను పూర్తిగా ఆపేసి, వాటి పనిని బయటే ‘హార్ట్‌ లంగ్‌ మిషన్‌’ అనే దానితో చేయిస్తూ.. సర్జరీ పూర్తి చేయటం పరిపాటి. అయితేఈ మెషీన్‌ను గట్టిగా 3-4 గంటలు, మరీ అవసరమైతే 6 నుంచి 8 గంటల వరకూ వాడొచ్చు. అంతకు మించి ఈ సాధారణ హార్ట్‌ లంగ్‌ మిషన్‌ను వాడటం కష్టం. కానీ కొంత దీర్ఘకాలం.. అంటే ఎక్కువ రోజుల పాటు రక్తాన్ని శుద్ధి చేసి, ఆక్సిజన్‌ను అందించాల్సిన అవసరం తలెత్తినప్పుడు ‘ఎక్మో’ విధానం బాగా అక్కరకొస్తుంది. ఎక్మో (ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌) అంటే... శరీరానికి బయటే రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అని అర్థం! ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న రక్తాన్ని బయటకు రప్పించి.. దాన్ని బయటే శుద్ధి చేసి.. తిరిగి ఆక్సిజన్‌ నింపుకున్న రక్తాన్ని లోపలికి ఎక్కించటం ఈ ప్రక్రియ మూల సూత్రం.

ఏమిటి ప్రయోజనం?
గుండె, వూపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తుంటాం కాబట్టి ఆ రెంటికీ పూర్తి విశ్రాంతి చిక్కి, అవి త్వరగా కోలుకుంటాయి. కృత్రిమంగానే అయినా ఒంట్లో రక్త సరఫరా తగ్గకుండా చూస్తుంటాం కాబట్టి ఒంట్లో అవయవాలేవీ దెబ్బతినే ప్రమాదం ఉండదు. దెబ్బతిన్నా కూడా వాటినే బలవంతానా పనిచేయించాలని చూడకుండా... గుండెకు, వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి, కోలుకునేంత సమయం ఇవ్వటం దీనిలోని ముఖ్య సూత్రం.

ఉన్నట్టుండి గుండె లేదా వూపిరితిత్తుల పనితీరు దెబ్బతినిపోయిన వాళ్లకు ఇది బాగా అక్కరకొస్తుంది. క్రమేపీ దెబ్బతినే వాళ్లకు దీనితో పెద్ద ఉపయోగం ఉండదు, వాళ్లకు గుండె మార్పిడి వంటివే సరైన మార్గాలు.

ఎంత కాలం ఉంచగలం?
ఎక్మో విధానంలో 2-3 వారాల పాటు కూడా చికిత్స ఇవ్వచ్చు. వూపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకు ఫలితాలు చాలా బాగుంటున్నాయి. వీరు 70-80% వరకూ కోలుకుంటారు. కానీ గుండె దెబ్బతినటం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండటం లేదు. ఇప్పుడిప్పుడే ‘ఎక్మో’ మన దేశంలో కూడా ప్రాచుర్యంలోకి వస్తోంది.

ఎక్మోతో దుష్ప్రభావాలుంటాయా?
వాస్తవానికి ఈ ఎక్మో చికిత్స కోసం.. రక్తాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చటమే కష్టం. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగికి ఇది కొంత సంక్లిష్టమైన వ్యవహారం. రక్తస్రావం అయిపోవటం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్తనాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే రక్తాన్ని బయటే శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్‌లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటన్నింటినీ నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంటారు.

ఎవరికి చేస్తారు?
వాస్తవానికి ఎక్మో విధానం- పుట్టుకతోనే గుండె లోపాలతో, లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే పసి గుడ్డుల్లోనూ, చిన్నపిల్లల్లో చాలా విస్తృతంగా వాడకంలో ఉంది. పెద్దలకు కూడా- వూపిరితిత్తులు దెబ్బతిని, అవి సరిగా పని చేయని సందర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించాల్సి వస్తుంటుంది.

* కొందరు పిల్లలకు పుట్టుకతోనే వూపిరితిత్తులు గట్టిగా ఉంటాయి. అలాగే కొందరికి శ్వాస తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది. కొందరు పిల్లలు తల్లికడుపులోనే మలం మింగటం వల్ల పుట్టగానే శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొందరు పిల్లలకు వైరల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల ఉన్నట్టుండి రెండు వూపిరితిత్తులూ గట్టిగా, పని చేయకుండా అయిపోతాయి. ఇలాంటి వారందరికీ- వెంటనే వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి ఇచ్చి, చికిత్స చేస్తుంటే క్రమేపీ ఓ వారం పది రోజుల్లో వాళ్ల వూపిరితిత్తులు సహజంగానే తిరిగి కోలుకుంటాయి. ఇలా వూపిరితిత్తులకు పూర్తి విశ్రాంతి ఇచ్చేందుకు ‘ఎక్మో’ ఉపయోగపడుతుంది.

రెండోది- కొందరికి వైరస్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంది (మయోకార్డైటిస్‌). ఇలాంటి సందర్భాల్లో గుండె పంపింగ్‌ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇలాంటి వారికి ఆ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ తగ్గే వరకూ కూడా మనం బయటి నుంచి సాంత్వనఇవ్వగలిగితే మళ్లీ తమంతట తామే పూర్తిగా కోలుకుంటారు. ఇలాంటి వారికి కూడా ‘ఎక్మో’ బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్‌ చేరిపోయి.. తీవ్రమైన ‘సెప్సిస్‌’ ఉన్న వాళ్లకు.. రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండెపోటు సమస్య లేకుండా ఉన్నట్టుండి గుండె పనితీరు, పంపింగ్‌ సామర్థ్యం దెబ్బతిన్న వాళ్లందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన న్యుమోనియా వచ్చి రెండు వూపిరితిత్తులూ పని చేసే స్థితిలో లేనప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఎప్పుడు తీసేస్తారు?
రోగి కోలుకుంటున్న కొద్దీ అంటే రోగి వూపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ, లేదా గుండె పంపింగ్‌ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వచ్చి, చివరకు పూర్తిగా తీసెయ్యచ్చు.

ఎక్మో.. ఎలా చేస్తారు?
రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి, లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచిగానీ గానీ, తొడ దగ్గరగానీ లోనికి పంపి రక్తనాళాల్లో అమరుస్తారు. అవసరాన్ని బట్టి, రోగి పరిస్థితిని బట్టి ఈ గొట్టాలను ఎలా అమర్చాలన్నది నిర్ణయిస్తారు. ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఒక గొట్టం గుండా రక్తం యంత్రంలోకి వచ్చి, తగినంత ఆక్సిజన్‌ తీసుకుని శుద్ధి అయిన తర్వాత.. తిరిగి మరో గొట్టం ద్వారా శరీరంలోకి వెళ్లిపోతుంటుంది. ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ.

* సిర నుంచి రక్తాన్ని బయటకు తీసుకువచ్చి, బయటే యంత్రంలో ఆ రక్తాన్ని శుద్ధి చేసి (అంటే ఆక్సిజన్‌ నింపి), తిరిగి సిరలోకి ఎక్కించటం ఒక పద్ధతి. దీన్ని ‘వీనో వీనస్‌’ పద్ధతంటారు. సాధారణంగా రోగి గుండె బాగానే పని చేస్తూ, వూపిరితిత్తులు ఒక్కటే సరిగా పని చేయని వారికి ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు.

* సిర నుంచి రక్తాన్ని బయటకు తీసి, యంత్రాల సాయంతో బయటే శుద్ధి చేసి, తిరిగి ఆ రక్తాన్ని ధమని ద్వారా లోనికి పంపటం, అక్కడి నుంచి శరీరమంతా కూడా సరఫరా అయ్యేలా పంపింగ్‌ చేయటం మరో పద్ధతి. దీన్ని ‘వీనో-ఆర్టీయల్‌’ పద్ధతంటారు. వూపిరితిత్తులతో పాటు గుండె కూడా సమర్థంగా పనిచేయని వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ రెండు కీలక అవయవాలకూ విశ్రాంతి లభిస్తుంది, అవి త్వరగా కోలుకునే వీలు చిక్కుతుంది.
******************

సదలవాట్లు - మనం చేసే పొరపాట్లు

ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు🌷

👍తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము....

1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు...

2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.

3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు..

4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.

5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.

6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..

7.సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.

8.పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి,

9. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.

10. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి,

11. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..

12. రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..

13. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు

14. సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..

15. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.

16.శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..

17. జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు  మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.

18. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు,  నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.

 19.  ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు  ఆహారం అందదు అంటారు

20. వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పోరాబాటుగా కూడా మట్టాలాడే టప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పోరాబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.

 21. ఇంటి ముంగిటలో తమల పాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మ మైలు గాలి తగల కూడదు..

22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు.

23.తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు, పొద్దు పోయాక నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి...

24. దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి, గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు...ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది.

25.ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.

26. రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు   డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..

27.అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.

28.వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.

29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.

30. విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,

31. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.

32.ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారిఅయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.

 33. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు,

 34. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు..

35. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు.

36.మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు, గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు.

37. రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు, గుమ్మం చిలుకు ఆడించకూడదు.

38. తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి..

39. వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.

40.ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి,

41. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి,

42. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో బీపెట్టాలి .

43. జితం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఊపు కొనాలి ధనం ఇంట్లో నిలుస్తుంది.

44. రాహు కాలంలో ,స్నానం, భోజనం, మైధునం చేయాకుడదు .

45. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మటుకే పెట్టాలి.

46. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయాకుడదు.

ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డి గా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి..👌
*********************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*16.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|*

*హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥*

*శ్రీశుకుడు వచించెను* - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

*16.2 (రెండవ శ్లోకము)*

*ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|*

*నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥*

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని, అలంకరణములు గాని, లేకుండుట గమనించెను".

*16.3 (మూడవ శ్లోకము)*

*స పత్నీం దీనవదనాం కృతాసనపరిగ్రహః|*

*సభాజితో యథాన్యాయమిదమాహ కురూద్వహ॥6898॥*

"మహారాజా! అచటికి వెళ్ళి, సుఖాసీనుడైన పిదప అదితి విధ్యుక్తముగా ఆయనను సత్కరించెను. అపుడు అదితి ముఖము దైన్యముతో వాడిపోయి యుండుటను జూచి కశ్యపుడు ఆమెతో ఇట్లనెను"

*16.4 (నాలుగవ శ్లోకము)*

*అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేఽధునాఽఽగతమ్|*

*న ధర్మస్య న లోకస్య మృత్యోశ్ఛందానువర్తినః॥6899॥*

"కల్యాణీ! ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదుగదా! ధర్మపాలన చక్కగా కొనసాగుచున్నదిగదా! భయంకరమైన కాలమునకు వశులైన జనులకు ఎట్టి అశుభమూ ప్రాప్తింపలేదుగదా!"

*16.5 (ఐదవ శ్లోకము)*

*అపి వాకుశలం కించిద్గృహేషు గృహమేధిని|*

*ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినామ్॥6900॥*

"గృహిణీ! యోగసాధన చేయని వారికి గూడ గృహస్థాశ్రమమున యోగసాధన ఫలము లభించును. ఈ గృహస్థాశ్రమము నందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏవిధమైన విఘ్నములును వాటిల్లలేదుగదా!"

*16.6 (ఆరవ శ్లోకము)*

*అపి వాతిథయోఽభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా|*

*గృహాదపూజితా యాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్॥6901॥*

*16.7 (ఏడవ శ్లోకము)*

*గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి|*

*యది నిర్యాంతి తే నూనం ఫేరురాజగృహోపమాః॥6902॥*

"దేవీ! నీవు గృహకార్యములయందు నిమగ్నురాలవై అలసిసొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి యుండవచ్చును. అందువలన నీకు ధైర్యము కల్గియుండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుంఢ అతిథులు వెళ్ళిపోయినచో, అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము".

*16.8 (ప్రథమ శ్లోకము)*

*అప్యగ్నయస్తు వేలాయాం న హుతా హవిషా సతి|*

*త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్॥6903॥*

"శుభాంగీ! నేను ఎప్పుడైననూ బయటికి వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నులయందు హవిస్సులను సకాలమున సమర్పింపలేదా? యేమి?"

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*

*యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః|*

*బ్రాహ్మణోఽగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖమ్॥6904॥*

"బ్రాహ్మణులు, అగ్ని, సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరిని పూజించిన గృహస్థుడు సకలకోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును".

*16.10 (పదియవ శ్లోకము)*

*అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని|*

*లక్షయేఽస్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహమ్॥6905॥*

"సాధ్వీ! నీవు సర్వదా ప్రసన్నురాలవై యుందువు. కాని, ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూచినచో, నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురియైనట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరును క్షేమమేగదా!"

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

*అష్టమ స్కంధము - పదునైదవ అధ్యాయము*

*బలిచక్రవర్తి స్వర్గమును జయించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*హేమజాలాక్షనిర్గచ్ఛద్ధూమేనాగురుగంధినా|*

*పాండురేణ ప్రతిచ్ఛన్నమార్గే యాంతి సురప్రియాః॥6878॥*

బంగారు కిటికీల ద్వారా అగరు సుగంధములతో గూడిన తెల్లని ధూమములు బయలువెడలి అచటి మార్గములను కప్పివేయుచుండెను. ఆ మార్గములలో దివ్యభామినులు సంచరించుచుండిరి.

*15.20 (ఇరువదియవ శ్లోకము)*

*ముక్తావితానైర్మణిహేమకేతుభిర్నానాపతాకావలభీభిరావృతామ్|*

*శిఖండిపారావతభృంగనాదితాం   వైమానికస్త్రీకలగీతమంగళామ్॥6879॥*

అచ్చటచ్చట ముత్యములు గూర్చిన మేలుకట్టులు వ్రేలాడుచుండెను. మణిమయములైన బంగారు పతాకములు, చిన్న చిన్న జెండాలు రెపరెపలాడుచుండెను. నెమళ్ళ క్రేంకారములు, పావురముల మధుర ధ్వనులు, తుమ్మెదల ఝంకారములు వినసొంపుగా ఉండెను. దేవాంగనలు మధురముగా మంగళ గీతములను ఆలపించుచుండిరి.

*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*మృదంగశంఖానకదుందుభిస్వనైః  సతాళవీణామురజర్ష్టివేణుభిః|*

*నృత్యైః సవాద్యైరుపదేవగీతకైర్మనోరమాం స్వప్రభయా జితప్రభామ్॥6880॥*

ఆ నగరమున మృదంగములు, శంఖములు, నగారాలు, డోళ్ళు, వీణలు, వేణువులు, మురజములు, ఋష్టివాద్యములు శ్రావ్యముగా మ్రోగుచుండెను. గంధర్వులు, వాద్యములతో గానములను ఆలపించుచుండిరి. అప్సరసలు నృత్యములు చేయుచుండిరి. ఈ విశేషములతో అమరావతీ శోభ ఆ నగరాధిష్ఠాత్రియగు దేవి వైభవమును మించియుండెను.

*15.22 (ఇరువదియవ శ్లోకము)*

*యాం న వ్రజంత్యధర్మిష్ఠాః ఖలా భూతద్రుహః శఠాః|*

*మానినః కామినో లుబ్ధా ఏభిర్హీనా వ్రజంతి యత్॥6881॥*

ఆ పురమునందు అధర్మపరులు, దుష్టులు, ప్రాణులకుహాని గూర్చువారు, మోసకారులు, అహంకారులు, విషయలోలురు, కాముకులు, లోభులు ఎవరును ప్రవేశింపజాలరు. ఈ దోషములులేని వారు మాత్రమే ఆ పురమునందు ప్రవేశింతురు.

*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తాం దేవధానీం స వరూథినీపతిర్బహిః  సమంతాద్రురుధే పృతన్యయా|*

*ఆచార్యదత్తం జలజం మహాస్వనం దధ్మౌ ప్రయుంజన్ భయమింద్రయోషితామ్॥6882॥*

దైత్యాసేనలకు ప్రభువైన బలిచక్రవర్తి తమ గొప్ప సైన్యములతోగూడి, అమరావతీ నగరమును అన్ని వైపుల నుండి ముట్టడించెను. అతడు శుక్రాచార్యుడు ఇచ్చిన మహాశంఖమును పూరించెను. ఆ శంఖధ్వని సర్వత్ర వ్యాపించి, ఇంద్రుని భార్యల హృదయములలో భయమును కలిగించెను.

*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*మఘవాంస్తమభిప్రేత్య బలేః పరమముద్యమమ్|*

*సర్వదేవగణోపేతో గురుమేతదువాచ హ॥6883॥*

బలిచక్రవర్తి పూర్తిగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన విషయమును ఇంద్రుడు గమనించెను. అందు వలన  అతడు దేవతలందరితో గూడి తమ గురువైన బృహస్పతియొద్ద చేరి అతనితో ఇట్లు పలికెను-

*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భగవన్నుద్యమో భూయాన్ బలేర్నః పూర్వవైరిణః|*

*అవిషహ్యమిమం మన్యే కేనాసీత్తేజసోర్జితః॥6884॥*

మహాత్మా! నాకు పూర్వశత్రువైన బలి పూర్తిగా యుద్ధమునకు సన్నద్ధుడై వచ్చినాడు. మేము అతనిని ఎదిరించుటకు సాధ్యముకాదని అనుకొనుచున్నాము. అతనికి ఇంతటి శక్తి ఎట్లు వచ్చినదో తెలియుటలేదు.

*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*నైనం కశ్చిత్కుతో వాపి ప్రతివ్యోఢుమధీశ్వరః|*

*పిబన్నివ ముఖేనేదం లిహన్నివ దిశో దశ|*

*దహన్నివ దిశో దృగ్భిః సంవర్తాగ్నిరివోత్థితః॥6885॥*

ఈ సమయముస బలిచక్రవర్తిని ఎవ్వరుగూడ  ఎదుర్కొనజాలరు. అతడు ప్రళయాగ్నివలె మన మీదికి విజృంభించుచున్నాడు. నోటితో ఈ విశ్వములను కబళించి వేయుచున్నట్లును, పదిదిక్కులను మ్రింగివేయుచున్నట్లును చూపులతో    దశదిశలను దహించివేయు చున్నట్లును కనబడుచున్నాడు.

*15.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*బ్రూహి కారణమేతస్య దుర్ధర్షత్వస్య మద్రిపోః|*

*ఓజః సహో బలం తేజో యత ఏతత్సముద్యమః॥6886॥*

గురువర్యా! నా శత్రువైన బలిచక్రవర్తి యొక్క ఎదురు లేని శక్తికి కారణమేమో తెలుపుడు. అతనికి శారీరక, మానసిక, ఇంద్రియముల యొక్క బలము ఇంతటి తేజస్సు ఎక్కడినుండి వచ్చినది? వీటి కారణముననే అతడు మనపై దండయాత్రకు సిద్ధమైనట్లున్నాడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునైదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
***************

మంచి విచారం

ఈ మయ ప్రపంచంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూవుంటాయి. అవి సముద్రపు అలల వంటివి. ఈ సత్యాన్ని నివ్వు ఎందుకు గ్రహించవు....?

కేవలం సుఖం మాత్రమే కావాలను కుంటున్నావా.. ? సుఖదుఃఖాల మధ్యన మన జీవిత సాఫల్యానికి గల అర్థాన్ని గ్రహించాలి.

చిక్కుల్లోనే మానవుడు ఎదుగుతాడు. మనిషి అయినా, జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

చెట్టు ఋతువును బట్టి మారుతుంది. శిశిరంలో ఆకురాలుస్తుంది. చెట్టు ఎండినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి చెట్టు ఎండిపోదు. మళ్లీ వసంతం వస్తుంది. చెట్టు చిగురిస్తుంది. పచ్చని మాను ఔతుంది. జీవితం కూడా అంతే మిత్రమా..... వాడినా..... చిగురిస్తుంది.

బతుకు సఫలం, సార్థకం కావాలంటే మనిషి నిరంతరం సవాళ్లకు సిద్దమై ఉండాలి. భద్రమైన జీవితాన్ని కోరుకునేవారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు...

అనుకోని వ్యాధులు విజృంభిస్తున్నయని, ఆశల అంచనాలు తారుమారు అవుతున్నాయని, మనలను వంచనకు, మోసానికి గురిచేశారని నేడు మనం కకావికలమవుతున్నాం. కానీ... కాస్తా ఆలోచించు... మానవ దేహాన్ని ధరించిన భగవంతుడికి, మహాత్ములకు, మహాపురుషులకు కూడా తప్పలేదు.వారందరు దుఃఖమనే, కష్టమనే సాగరంలో రమిస్తూ.. నడుచుకుంటూ సుధీరతీరాలకు చేరుకున్నారు..కాస్తా యోచించు....

ప్రపంచంలో మనిషులు  ఏదోఒక అసంపూర్తితో వ్యధతో బతుకు వెళ్లదీస్తున్నారు గ్రహించు . నీ కన్నీళ్లు గ్లాసేడే...కానీ,.. ఎదుటి వాడి కన్నీళ్లు బిందెడు.గా ఉంది .ఇతరులను చూసి నీ జీవితాన్ని అన్వయించుకోకు మోసపోతావు...

మిత్రమా... ప్రతివారిలో అనంతమైన శక్తి దాగిఉంది. దాన్ని మేలుకొలుపు. అది ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇస్తుంది. నీవు నీ  పట్ల విశ్వాసం కోల్పోతే ఈ విశ్వమే నీకు ఓ పెద్ద ప్రతిబంధకమవుతుంది .

నిర్మల హృదయమే భగవన్నిలయం మనసు నిర్మలంగా ఉంటేనే భగవద్రూపం స్పష్టంగా గోచరిస్తుంది. అద్దం మాలినమైతే ప్రతిభింబం కనబడదు కదా ! అందువల్ల మన హృదయం నిర్మలంగా ఉండేందుకు స్తంభమనే భగవంతుణ్ణి పట్టుకొని, కష్టాల కడలిని దాటుకొంటూ సాగిపో.......
*********************

గోమాత గొప్పదనం

ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.

అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు…
నీ సంస్కారం…
నీ విచక్షణ…
నీ విజ్ఞత…

గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా.....

ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని.. ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని....

ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.

ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?

గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.

విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని. అందుకే శుభకార్యాలలో, నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు.

గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు (Oxygen )ఉత్పత్తి అవుతుంది.

గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.

గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ...,మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి,  మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి.*

ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు.

చాలామంది హిందువులకే తెలియదు ఈ గోమాతల ఉద్భవం ఎలా జరిగిందని...

*ఒకసారి దేవతలూ రాక్షసులు కలిసి అమృతం కోసం పర్వతమధనం చేయగా అందునుండి పుట్టిన  కల్పవృక్షం,ఐరావతమూ,
కామధేనువులతో
పాటుగా విషము, అమృతము అదే విధంగా...
ఐదు గోమాతలు కూడా ఉద్భవించాయి... పుట్టిన అన్నింటినీ అందరినీ పంచుకోగా..*

ఈ  గోమాతలను 5  మహాముణులైన మహర్షుల ఆశ్రమాలకు ( జమదగ్ని,భారధ్వజుడు,వశిష్ఠుడు,గౌతమ మహర్షి మరియు కశ్యపుడు)లకు దేవతలు అప్పగించినవే ఈ పంచగోమాతలు.

ఆవు లో అతిముఖ్యమైన విశేషణం ఒకటుంది... రోజూ గ్రాసం/ దాణా వేసే వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందుగా ఆవు గ్రహించి... ఆరు బయట/ అడవికు వెళ్లి ఆ వ్యక్తుల వ్యాధికి సంబంధించిన ఔషధం(ఆకులు)తిని ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది. ఆ పాలనే కుటుంబ సభ్యులు పాలు,పెరుగు, మజ్జిగ రూపంలో స్వీకరించడం వల్ల అనారోగ్యం తగ్గిపోతుంది.

ఇంకో మంచిమాట!
*****
గోమాత గురించి చెప్పాలంటే ఒక మనిషియొక్క పూర్తి జీవితకాలం సరిపోదు.
సింపుల్ గా చెప్పాలంటే గోమాత శరీరం మీదవున్న రొమాలని ఆశ్రయించుకొని ముక్కోటి దేవతలూ ఆవాసం వుంటారు...

అందుకే గోమాతను సకలదేవతల నిలయంగా భావించి మ్రొక్కుతారు.

ఒక్క ఈ పవిత్ర భారతదేశంలో మాత్రమే పధ్దతిగా ,విలువలతో కూడి ఉంటారు.... ఎందుకంటే....ఇక్కడ  గోవు ని కూడా...మాత గా పూజిస్తారు...

అందువల్లనే కొందరు పుణ్యపురుషులు ఇలా అన్నారు.
*********
”గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.

”ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.

”ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.

”గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసము రోగకారకము”.

”గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును”.

భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?

మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం మన ధర్మం. స్వేచ్ఛంటే….”నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు” మనదేశం మెచ్చేటట్టు బ్రతకడం”

”వందేగోమాతరం”
***************

శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

అనవద్యంబగు హేమపాత్రమున నిత్యంబిష్టమృష్టాన్నముల్
తినగాజాలినవాడు నయ్యును మహాదేవుండు భిక్షాన్నమున్
పునుకన్ కోరి భుజించేటేల?ప్రభు డెప్డున్ పాలితుల్ పొందు తు
ప్టిని ముష్టింగొని పుష్టిగాంచు గనుకన్ శ్రీ సిద్దలింగేశ్వరా

(భూతత్త్వం)

భావం : పాలకుడైన రాజుకు నిజమైన పుష్టిని చేకూర్చి పదికాలాలపాటు పదవిలో నిల్పగలిగేది రాచరికపు హంగులు మృష్టాన్నములు కావు, తన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో తృప్తిగా వున్నారా అనేది ముఖ్యం. వారి తృప్తియే ప్రభువునకు పుష్టి.
అందుకే విశ్వేశుడైన శివుడు - "మృష్టాన్నములు మాని పాలితుల భక్తి ప్రపత్తులను బిచ్చంగా గొని పుష్ఠిని చేకూర్చుకోవా”లని ప్రభువులకు సందేశం అందజేస్తాడు భిక్షాన్నం తినడం ద్వారా
***************

దాతృత్వం

హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....
భోజనానికి ఎంత తీసుకుంటారు......
యజమాని చెప్పాడు...
చేపల పులుసుతో అయితే 50 రూపాయలు,
అవి లేకుండా అయితే 20 రూపాయలు....
ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....
నా చేతిలో ఈవే ఉన్నాయి..
వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...
కాస్త ఆకలి తీరితే చాలు.
నిన్నటి నుండి ఏమీ తినలేదు...
ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....
హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.
నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను.... ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*

మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,
* ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*
   * నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు  ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....*
* ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*
* అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.
* ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....*
* నేను వృద్దుణ్ణి కదా....? కనీసం
నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...*
* వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...*
* ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...*
పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...
* కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు...* కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు.* తండ్రి* పై చేయి చేసుకున్న * కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....*?
ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..
తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....
యజమాని  వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....*
* ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*
* మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*
* ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*
* చాలా సంతోషం, మీ ఉపకారానికి....
ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా... వెళ్ళిపోయాడు.
*ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.
* అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని .......*
పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???
*కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతీది షేర్ చేసి MB అవగొట్టేవాళ్ళు, దీన్నికూడా షేర్ చెయ్యండి
ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....* చాలు.*
* మార్పు మననుండే ప్రారంభం కానీయండి
***************

Srimadhandhra Bhagavatham -- 97

బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట
దుర్యోధనునకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడయిన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. దుర్యోధనుడు అందరూ సైన్యంతో వెళ్లి అతనిని ప్రతిఘటించండి అని తన సైన్యమును ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్లి సాంబుడిని ప్రతిఘటించారు. సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనుస్సు విరిచేసి అశ్వములను కూలద్రోసి ఆయన సారధిని నిర్జించి సాంబుడిని, సాంబుడు తీసుకుపోతున్న కన్యయైన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనునకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరిని ఖైదు చేశాడు. ఈవార్త ద్వారకా నగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వ సైన్యములతో దుర్యోధనుని మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు.
బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉన్నది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈమాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు నేను వెళతాను. దుర్యోధనునకు నాలుగుమంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను’ అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్లి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరిబయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహా బలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటపుడు ఉద్ధవుడిని పిలిచి చాలా అద్భుతమైన వేదాంత బోధ చేస్తాడు.    బలరాముడు ఉద్ధవుడిని దుర్యోధనుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్లి ఒకమాట చెప్పాడు. ‘మీ అందరిచేత పూజింపబడవలసిన వాడయిన బలరాముడు పెద్దలయిన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను సేవించ వలసినది’ అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకొని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సేవించాడు. బలరాముడిని పొగిడాడు. బలరాముడు ‘నా తమ్ముడయిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తెయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నీవు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. నీవు నా తమ్ముని కుమారుని, కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ‘ఏమి చెప్పావు బలరామా! కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడ! యాదవులయిన మీరెక్కడ! మీరు పశువులను తోలుకునే వారు, రాజ్యాధికారం లేదు మీకు మా పిల్ల కావలసి వచ్చిందా! నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉన్నది’ అని యయాతి శాపం చేత అసలు యాదవులయిన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులన్నీ ధరిస్తున్నారు. రాజభోగములనన్నిటిని అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుడిని చూసి మిమ్ములను చూసి ఎవరూ గౌరవించలేదు. మీరు దుర్యోధనుడి గురువుగారు అని కౌరవులతో మీకు సంబంధం ఉన్నది. మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రానురాను ఆ గౌరవమును పక్కన పెట్టి మాతోనే వియ్యమందాలని కోరిక పుట్టిందే మీకు! ఇది జరిగే పని కాదు. మీ హద్దులో మీరు ఉండడం మంచిది’ అని చెప్పి దుర్యోధనుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేదు. ఆయనతో మాటలాడడమేమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అపుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా! ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి.
ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుని వధించాలని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈవేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో, అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదో, ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవి తాపత్రయ పడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని అంశభూతముగా నేను, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడయిన శ్రీకృష్ణపరమాత్మ గొప్పతనం చేత ఇవ్వాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు’ అన్నది పరమ యథార్థము. ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడే వానికి తగిన బుద్ధి చెప్పి తీరాలని లేచి గంగానది ఒడ్డుకు వెళ్లి ఈ హస్తినాపురము నంతటిని నాగలితో పట్టి లాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను’ అని తన నాగలిని హస్తినాపుర నేల లోపలికంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రములో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఇన్ని రాజసౌధములతో ఉండే హస్తినాపురము అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు అంతఃపురము కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగిందని అడిగాడు. నీవు అన్న మాటకి బలరాముడు హస్తినాపురిని నాగలికి తగిలించి గంగలో కలుపుతున్నాడు’ అన్నారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగుపరుగున వచ్చాడు.
 దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండని ప్రార్థించాడు. బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలను ఇచ్చి లక్షణను సాంబుడిని రథము ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది. ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది.
బలరాముడు తీర్థయాత్రకు జనుట
బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమయిన లీల చేశాడు. ఆయన సూతుడిని చంపివేశాడు. సూతుడు పురాణములను చెప్తూ ఉండే మహానుభావుడు. సత్త్వ గుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవత్కథలు చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి? అనగా బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనక పోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక్క సూతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలనుకుని సూతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సూతుని కంఠం మీద కొట్ట్టాడు. కొడితే సూతమహర్షి కంఠం తెగిపోయి కిందపడిపోయాడు. సభలో హాహాకారములు చెలరేగాయి. బలరాముడు ‘నాపట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు నేను ఆయన కంఠమును నరికేశాను’ అన్నాడు. అక్కడ పురాణమును వింటున్న వాళ్ళు ‘బలరామా! నీవలన జరుగకూడని అపచారం జరిగింది. సూతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెప్తాము ‘నీకు తెలియని రహస్యములున్నాయా! నీకు తెలియని ధర్మ సూక్షములున్నాయా! ఆయనకు మేము బ్రహ్మాసనమును ఇచ్చాము. ఆయన బ్రహ్మయై కూర్చుని ఉండగా నీవు సభలోనికి వచ్చావు. బ్రహ్మగా కూర్చుని వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు. అందుకని సూతుడు కూర్చున్నాడు సూతునియందు దోషం లేదు. ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నీవు చేసినది సామాన్యమయిన పాపం కాదు’ అని చెప్పారు.
  బలరాముడు తానుచేసిన పనికి చాలా బాధపడి ఇప్పుడు నేను ఏమి చేయాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి’ అని అడిగాడు. మహర్షులు ‘నేను అనంతుడను’ అని అన్నావు కదా! ఆ ఈశ్వరశక్తితో సూతుడికి మరల ప్రాణం పోయవలసింది అన్నారు. బలరాముడు ‘నిజమే సూతుడు బ్రతక వలసిన వాడు. లోకమునకు పనికివచ్చేవాడు. ఈ సూతుడిని నా యోగ శక్తిచేత బ్రతికిస్తాను’ అన్నాడు. ఇకపై సూతునకు రోగమనేది ఉండదు. బుద్ధియందు ధారణశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. సామర్థ్యములను సూతునకిచ్చి పునఃజీవితమును ఇస్తున్నానని మరణించిన సూతుని బ్రతికించాడు. నేను చేసిన తప్పు పనికి నా మనస్సు బాధ తీరలేదు. మీరు ఇంకా ఏదయినా అడగండి చేసిపెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చెయ్యడం తప్పుకాదు. మనుష్య జీవితంలో పొరపాటు చేయనివాడు ఉండడు. పొరపాటు చేసిన వాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకుని ఆ తప్పును అంగీకరించి దానిని సరిద్దిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది.
****************

విలువలు తెలిపే కధ

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.

🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏
****************

విలువలు తెలిపే కధ

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.

ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!

ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.

ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.

లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.

🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి🙏
****************

విజ్ఞేశ్వరుడు

౧. జయ విఘ్నకృతామాద్య భక్త నిర్విఘ్నకారక!
అవిఘ్న విఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్!!
౨. జయ సర్వ గణాధీశ జయ సర్వ గణాగ్రణీః!
గణప్రణత పాదాబ్జ గణనాతీత సద్గుణ!!
౩. జయ సర్వగ సర్వేశ సర్వ బుద్ధ్యేక శేవథే!
సర్వమాయా ప్రపంచజ్ఞ సర్వ కర్మాగ్ర పూజిత!!
౪. సర్వమంగళ మాంగళ్య జయ త్వం సర్వమంగళ!
అమంగళోపశమన మహామంగళ హేతుక!!
౫. జయ సృష్టి కృతాం వంద్య జయస్థితి కృతా నత!
జయ సంహృతి కృత్ స్తుత్య జయ సత్కర్మసిద్ధిద!!
౬. సిద్ధవంద్య పదాంభోజ జయ సిద్ధి వినాయక!
సర్వ సిద్ధ్యేక నిలయ మహా సిద్ద్వృద్ధి సూచక!!
౭. అశేష గుణ నిర్మాణ గుణాతీత గుణాగ్రణీః!
పరిపూర్ణ చరిత్రార్థ జయ త్వం గుణవర్ణిత!!
౮. జయ సర్వ బలాధీశ బలారాతి బలప్రద!
బలాకోజ్జ్వల దంతాగ్ర బాలాబాల పరాక్రమ!!
౯. అనంత మహిమాధార ధరాధర విచారణ!
దంతాగ్రప్రోతదిజ్ఞాగజయ నాగవిభూషణ!!
౧౦. యే త్వం నమంతి కరుణామయ దివ్యమూర్తే!
సర్వైనసామపి భువో భువి ముక్తి భాజః!
తేషాం సదివ హరసీహ మహోపసర్గాన్!
స్వర్గాపవర్గమపి సంప్రదదాసి తేభ్యః!!
౧౧. యే విఘ్నరాజ భవతా కరుణా కటాక్షైః!
సంప్రేక్షితాః క్షితిటేల్ క్షణమాత్రమత్ర!
తేషాం క్షయంతి సకలాన్యపి కిల్బిషాణి!
లక్ష్మీః కటాక్షయతి తాన్పురుషోత్తమాన్ హి!!
౧౨. యేత్వాం స్తువంతి నత విఘ్న విఘాత దక్ష!
దాక్షాయణీ హృదయ పంకజ తిగ్మరశ్మే!
శ్రూయంత ఏవ త ఇహ ప్రథితా న చిత్రం
చిత్రం తదత్ర గణపా యదహో త ఏవ!!
౧౩. యే శీలయంతి సతతం భవతోంఘ్రి యుగ్మం
తే పుత్రా పౌత్ర ధనధాన్య సమృద్ధి భాజః
సంశీలితాంఘ్రి కమలా బహుభ్రుత్య వర్గైః
భూపాల భోగ్య కమలాం విమలాం లభంతే!!
౧౪. త్వం కారణం పరమకారణ కారణానాం!
వేద్యోsసి వేద విదుషాం సతతం త్వమేకః!
త్వం మార్గణీయ మసి కించన మూల వాచాం
వాచామగోచర చరాచర దివ్యమూర్తే!!
౧౫. వేదా విదంతి న యథార్థ తయా భవంతం
బ్రహ్మాదయోపి న చరాచర సూత్రధార!
త్వం హంసి పాసి విదధాసి సమస్తమేకః
కస్తే స్తుతి వ్యతికరో మనసాప్యగమ్య!!
౧౬. త్వద్దుష్టదృష్టి విశిఖైః నిహతాన్నిహన్మి
దైత్యాన్ పురాంధక జలంధర ముఖ్యకాంశ్చ!
కస్యాస్తి శక్తిరిహ యస్త్య దృతేsఫై తుచ్ఛం
వాంఛేద్విధాతుమిహ సిద్ధిద కార్యజాతం!!
౧౭. అన్వేషణే ఢుంఢిరయం ప్రథితోsస్తి ధాతుః
సర్వార్థ ఢుంఢితతయా తవ ఢుంఢినామ
కాశీ ప్రవేశమపి కో లభతేsత్ర దేహీ
తోషం వినా తవ వినాయక ఢుంఢిరాజ!!
౧౮. ఢుంఢే ప్రణమ్య పురతస్తవ పాదపద్మం
యో మాం నమస్యతి పుమానిహ కాశివాసీ!
తత్కర్ణమూల మధిగమ్య పురా దిశామి
తత్ కించిదత్ర న పునర్భవతాస్తి యేన!!
౧౯. స్నాత్వా నరః ప్రథమతో మణికర్ణికాయా
ముద్ధూళితాంఘ్రి యుగళస్తు సచైలమాశు
దేవర్షి మానవ పిత్రూనపి తర్పయిత్వా
జ్ఞానోదతీర్థమభిలభ్య భజేత్తతస్త్వాం!!
౨౦. సమోద మోదక భరైర్వర ధూపదీపై
ర్మాల్యైః సుగంధ బహుళైరనులేపనైశ్చ
సంప్రీణ్య కాశినగరీ ఫలదాన దక్షం
ప్రోక్త్వాథ మా క ఇహ సిధ్యతినైవ ఢుంఢే!!
౨౧. తీర్థాంతరాణి చ తతః క్రమవర్జితోsపి
సంసాధయన్నిహ భవత్కరుణా కటాక్షైః!
దూరీకృత స్వహిత ఘాత్యుపసర్గవర్గో
ఢుంఢే లభే దవికలం ఫలమత్ర కాశ్యాం!!
౨౨. యః ప్రత్యహం నమతి ఢుంఢి వినాయకం త్వాం
కాశ్యాం ప్రగే ప్రతిహతాఖిల విఘ్నసంఘః!
నో తస్య జాతు జగతీతలవర్తివస్తు
దుష్ప్రాపమత్ర చ పరత్రచ కించనాఫై!!
౨౩. యో నామ తే జపతి ఢుంఢివినాయకస్య
తమ్ వై జపంత్యనుదినం హృది సిద్ధయోsష్టౌ!
భోగాన్ విభుజ్య వివిధాన్ విబుధోప భోగ్యాన్
నిర్వాణయా కమలయా ప్రియతే స చాంతే!!
౨౪. దూరేస్థితోsప్యహరహస్తవ పాదపీఠం
యః సంస్మరేత్సకల సిద్ధిద ఢుంఢిరాజ!
కాశీ స్థితే రవికలం సఫలం లభేత్
నైవాన్యథా న వితథా మమ వాక్కదాచిత్!!
ఫలశ్రుతి
ఈ స్తోత్రమును పఠించెడు సజ్జనులను విఘ్నములు బాధింపవు. ఢుంఢిగణపతి సన్నిధియందు ఈ స్తుతిని చదివిన వారిని సర్వసిద్ధులు సేవించును. ఏకాగ్ర చిత్తముతో చదివిన వారు మానసిక పాపముల చేత బాధింపబడరు. ఢుంఢి స్తోత్రమును జపించువారికి పుత్ర, కళత్ర, క్షేత్ర, అశ్వ, మందిర, ధన, ధాన్యములు లభించును. సర్వసంపత్కరమగు ఈ స్తోత్రమును ముక్తికాముకులు ప్రయత్నపూర్వకముగా పఠించవలెను. ఈ స్తోత్రమును పఠించి వెళ్ళినయెడల కోరిన పనులు నెరవేరును.
*****************

తీసా యంత్రము



మనసులో తలచుకొన్న ప్రశ్నలకి, సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ప్రశ్న శాస్త్రము. ఆ శాస్త్రంలో తీసా యంత్రము చాలా ముఖ్యమైనది.

ఈ తీసా యంత్రంలో మూడు భాగాలు ఉన్నాయి.

 మొదటిది తీసా యంత్రము.
రెండవది 30 ప్రశ్న చక్రాలు.
చివరిది 30 సమాధాన చక్రాలు.

ప్రశ్న చక్రాలు బ్రహ్మ, విష్ణు, మహేష్, హనుమాన్, ఇంకా పంచ భూతాలు, ద్వాదశ రాశులు, నవ గ్రహాలు ఇత్యాది పేర్లతో మొత్తం 30 చక్రాలు ఉన్నాయి.

సమాధాన చక్రాలు కూడా అవే పేర్లతో ఒక్కొక్క చక్రంలో 15 సమాధానాలతో నిండి ఉన్నాయి.

తీసా అంటేనే 30 అని అర్థం ! హిందిలో “తీస్’’ అంటే ముఫ్ఫై అని అందరికీ తెలిసినదే కదా ! అలాగే సంస్కృతంలో “త్రింశ’’ అంటే ముఫ్ఫై అని అర్థం .అందుకే ఈ యంత్రాన్ని తీసా యంత్రము అని అంటారు.

ప్రశ్న చక్రాలు

హనుమాన్ (1 ) నా మనో వాంఛ పూర్తి అవుతుందా లేదా ?

అగ్ని (2) నాకు ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది ?
వాయువు(3) ఈ కార్యంలో లాభమా లేక నష్టమా ?
జలము (4) నాకు ఈ ప్రదేశంలో లాభం కలుగుతుందా లేక అన్య ప్రదేశంలో కలుగుతుందా ?
పృథ్వి (5) ఈ పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చునా లేదా ?
ఆకాశము (6) నా నష్ట ద్రవ్యము (పోయిన వస్తువు) దొరుకునా లేదా ?

మేషము (7) ఈ వ్యక్తిని నమ్మవచ్చా, కూడదా ?
వృషభము (8) ఈ యాత్ర వలన లాభమా లేక నష్టమా ?
మిథునము (9) నేను చేయదలచుకున్న పని సఫలమవుతుందా ,లేక విఫలమవుతుందా ?
కర్కాటకము(10) ఈ వివాహం చేసుకొంటే లాభమా , లేక నష్టమా ?
సింహము (11) ఈ వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల ,లాభమా లేక నష్టమా?
కన్య (12) ఈ స్త్రీ గర్భంలో శిశువు పురుషుడా లేక స్త్రీ శిశువా?
తుల (13) ఇతని రోగము బాగవుతుందా , లేదా?
వృశ్చికము (14) ఈ వ్యాజ్యం (కోర్టు కేసు) నుండి ఈ వ్యక్తికి ముక్తి లభిస్తుందా ,లేదా?
ధనస్సు (15) ఈ రోజు నాకు ఎలా గడుస్తుంది ?
మకరము (16) ఈ వ్యక్తి ప్రేత భాధతో పీడింపబడుతున్నాడా , లేక రోగముతోనా?
కుంభము (17) ఈ స్థలము కొంటే లాభమా , నష్టమా?
మీనము (18) ఈ వైద్యునితో రోగము నయమగునా , లేదా?

సూర్యుడు (19) నా నివాస గృహంలో ఏవైనా దోషాలు కలవా?
చంద్రుడు (20) ఈ కేసు గెలుస్తానా లేదా ?
కుజుడు (21) ఈ వార్త నిజమగునా , కాదా?
బుధుడు (22) ప్రస్తుత కష్టము నుండి నాకు విముక్తి కలదా, లేక లేదా?
గురుడు (23) ఈ ఉద్యోగము వలన నాకు లాభమా, నష్టమా?
శుక్రుడు (24) ఈ పోటీ పరీక్షలలో నాకు విజయం లభిస్తుందా , లేదా?
శని (25) ఈ వస్తువు నాకు అచ్చుబాటు అవుతుందా,లేదా ?
రాహువు (26) ఈ తప్పిపోయిన పశువు ఏ దిక్కుగా వెళ్లింది?
కేతువు (27) ఈ వ్యక్తి జీవించి ఉన్నాడా, లేక మరణించాడా?

బ్రహ్మ (28) నాకు అప్పు దొరుకుతుందా, లేదా?
విష్ణువు (29) ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్’ దొరుకునా, లేదా?
మహేశ్వరుడు (30) నాకు సమీప భవిష్యత్తులో బదిలీ అవకాశం కలదా, లేదా?

సమాధాన చక్రాలు

అగ్ని చక్ర ఫలాలు.:
(1) మీరు అదృష్టవంతులు.మీ కోరిక నెరవేరుతుంది. (2) మీ బదిలీ సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. (3) ప్రమోషన్ దొరుకుతుంది, కాని సూర్యుని ఆరాధన చేయాలి. (4) ఉద్యోగ, వ్యాపారాలు చేయండి .అప్పు దొరుకుతుంది. (5) జీవించి ఉండడం సందేహంగానే ఉంది. (6) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం లేదు. (7) దీనిని కొంటే నష్టం కలుగుతుంది. (8) జయం కలుగుతుంది. కాని కుజుని ఆరాధన చేయండి. (9) ఈ ఉద్యోగం వల్ల లాభం కలుగుతుంది. (10) ఈ కష్టం నుండి శీఘ్రంగానే నివారణ కలుగుతుంది. శివుని ఆరాధన చేయండి. (11) ఈ వార్త జరిగినది నిజమే . (12) కేసు గెలవడం సందేహంగా ఉంది, కేతువుని ఆరాధన చేయండి, మంచి జరగ వచ్చు. (13) ఈ ఇల్లు అశుభం . (14) ఈ వైద్యునితో జబ్బు నయమవుతుంది . (15) అవును, లాభదాయకమే.

వాయు చక్ర ఫలితములు :
(1) ఈ సంవత్సరం సంతోష జనకంగా ఉంటుంది. (2) మీ కోరిక నెరవేరుతుంది . (3) అవును, బదిలీ జరిగే యోగం గోచరిస్తోంది . (4) ప్రస్తుతం ప్రమోషన్’ లభించే అవకాశం తక్కువగా ఉంది. (5) ఉద్యోగ వ్యాపారాలు చేయాలనుకొంటే అప్పు దొరుకుతుంది. (6) జీవించి ఉండడం అనుమానాస్పదంగా ఉంది. (7) పశువు దక్షిణ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (8) కొనవద్దు, నష్టం కలగ గలదు. (9) సఫలత పొందగలరు. (10) ఉద్యోగం చేస్తే లాభిస్తుంది. (11) ఈ కష్టం నుండి ఆలస్యంగా నివారణ కలుగుతుంది. (12) ఈ వార్త అబద్ధం. (13) కేసు గెలవడం సందేహం. రాజీ చేసుకోండి . (14)ఈ ఇల్లు అచ్చుబాటు అవుతుంది. (15) ఈ వైద్యుని వల్ల రోగ నివారణ ఆలస్యంగా అవుతుంది.

జల చక్ర ఫలితములు :
(1) ఈ కార్యము వల్ల లాభం ఉంది. గురు ధ్యానం చేయండి. (2) ఈ సంవత్సరం కష్టదాయకంగా ఉంటుంది. కుజునికి శాంతి జరిపించండి. (3) మీ వాంఛ తీరే అవకాశం తక్కువగా ఉంది. (4) మీ సమీప భవిష్యత్తులో బదిలీ అయే అవకాశం లేదు. (5) అవును, ప్రమోషన్ ఆశించవచ్చు . (6) సమయం బాగు లేదు అప్పు దొరకదు. (7) జీవించి ఉండే అవకాశం తక్కువ. (8) పశువు ఉత్తర-పశ్చిమ దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (9) కొనండి, లాభం ఉంది. (10) అవును, సఫలత కలదు. (11) ఉద్యోగం చేస్తే లాభం కలుగుతుంది . (12) ఆలస్యంగా విపత్తు నుండి విరామం దొరుకుతుంది. (13) ఈ వార్త అబద్ధం . (14) కేసు గెలుస్తుంది. (15) ఈ ఇల్లు నిర్దోషంగా ఉంది. శుభం కలుగుతుంది.

ప్రుథ్వీ చక్ర ఫలితములు:
(1) అన్య ప్రదేశానికి వెళ్తే లాభం కలుగుతుంది. (2) ఈ కార్యంలో లాభం కలుగుతుంది. (3) మీకు ఈ సంవత్సరం సామాన్య శుభం. (4) కొంత పూర్తి అవుతుంది,కాని మరికొంత మిగిలి పోతుంది. (5) ఉద్యోగంలో త్వరలోనే బదిలీ అవుతుంది. (6) ప్రమోషన్’ ఆశించ వద్దు. (7) అప్పు దొరకదు. (8) జీవించి లేడు . ఆ పైన దేవుని దయ. (9) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. వెతికితే దొరుకుతుంది. (10) కొనవద్దు, హాని జరుగును . (11) అవును, సఫలత కలుగుతుంది. (12) ఈ ఉద్యోగ విషయంలో నమ్మకం లేదు. (13) ఈ దినము బాగాలేదు, అశాంతి తొలగదు. (14) ఈ వార్త జరిగినది నిజమే. (15) దేవుని దయవల్ల జయం కలుగుతుంది.

ఆకాశ చక్ర ఫలితములు:
(1) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట కష్టము . (2) ఈ స్థలములో లాభం ఉంది. సంతోషించు. (3) ఈ పనిలో హాని కలుగును. (4) ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. (5) మీ కోరిక ఆలస్యంగా నెరవేరుతుంది . (6) అవును, మీకు బదిలీ శీఘ్రంగా అవుతుంది. (7) ప్రస్తుతం ప్రమోషన్’ గురించి ఆశించవద్దు. (8) అప్పు దుర్లభం . (9) అతను జీవించే ఉన్నాడు. (10) పశువు తూర్పు దిశగా వెళ్లింది, త్వరపడితే దొరుకుతుంది . (11) లాభం కలుగును, కొనవచ్చు. (12) సఫలత పొందే అవకాశం తక్కువ. (13) ఈ ఉద్యోగం వలన హాని ఎక్కువ , నీ అంతట నీవే వదలి వేస్తావు . (14) ఈ కష్టము నుండి విముక్తి ఆలస్యంగా లభిస్తుంది. (15) ఈ వార్త నిజమేనని అనిపిస్తోంది.

మేష చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువు దొరుకుట సందేహము. (2) పారిపోయిన వ్యక్తి శీఘ్రముగా వచ్చును. (3) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము కలుగును. (4) ఈ పనిలో లాభ నష్టములు మధ్యమముగా ఉన్నవి. (5) ఈ సంవత్సరము మీకు కష్ట దాయకము. రాహువునకు శాంతి చేయండి. (6) మీ కోరిక పూర్తికాదు (7) బదిలీ యోగము కలదు. (8) ప్రస్తుతము ప్రమోషన్’ లభించే అవకాశం లేదు. (9) ఒక మిత్రుని ద్వారా అప్పు లభిస్తుంది. (10) అతను జీవించే ఉన్నాడు. (11) పశువు ఉత్తర దిశగా వెళ్లింది, దొరికే అవకాశం ఉంది. (12) కొనవద్దు, హాని కలుగును. (13) సఫలత కష్టదాయకము . (14) ఈ ఉద్యోగం వలన లాభదాయకమే . (15) కష్టము నుండి విముక్తి ఆలస్యము.

వృషభ చక్ర ఫలితములు:
(1) అవును యితడు నమ్మకస్తుడే. (2) పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. (3) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చేందుకు ఆలస్యం అనివార్యం. (4) మీకు ఈ స్థలం లోనే లాభము ఉంది. (5) ఈ పనిలో లాభము మధ్యమము. (6) ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితములు:ఇస్తుంది.బుధుని పూజించండి. (7) మీ కోరిక పూర్తి అయే అవకాశం లేదు. (8) బదిలీ శీఘ్రంగా అవుతుంది. (9) ప్రమోషన్ అయే యోగము గోచరిస్తున్నది. (10) అప్పు దొరుకుతుంది. (11) అతను జీవించి ఉన్నాడు. (12) పశువు పూర్వోత్తర దిశగా వెళ్లింది.దొరకుట దుర్లభము. (13) కొనవద్దు, హాని ఉంది. (14) పరిశ్రమ ద్వారా సఫలత కలుగుతుంది. (15) ఈ ఉద్యోగం ద్వారా లాభం ఉంది.

మిథున చక్ర ఫలితములు:
(1) అవును, ఈ యాత్ర వలన లాభము ఉంది. (2) ఇతను విశ్వాస పాత్రుడు (3) ఈ వస్తువు దొరకుట కఠినం . (4) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చును, నమ్మకం ఉంచండి. (5) అన్య ప్రదేశమునకు వెళ్ళినచో లాభము ఉంది. (6) ఈ పనిలో హాని ఉంది. (7) ఈ సంవత్సరం ప్రత్యేక దిశలోనూ విపరీతముగా ఉంది. కేతుగ్రహ శాంతి చేయండి. (8) ప్రస్తుతము మీ కోరిక నెరవేరదు. (9) బదిలీ యోగము కలదు, దేవుని పూజించండి. (10) అవును, ప్రమోషన్’ యోగము కలదు. (11) అప్పు దొరికే అవకాశము లేదు. (12) అతను జీవించి ఉండుట సందేహాస్పదంగా ఉంది. (13) పశువు ఉత్తర దిశగా వెళ్లింది. దొరుకుట దుర్లభము. (14) కొనవచ్చు, లాభము కలుగును. (15) అత్యంత పరిశ్రమ చేత సఫలత కలుగుతుంది.

కర్కాటక చక్ర ఫలితములు:
(1) సఫలత ప్రాప్తిస్తుంది. (2) ఈ యాత్ర వలన లాభాంశము తక్కువ. (3) ఇతను విశ్వాసపాత్రుడైనవాడు కాడు . (4) ఈ వస్తువు దొరుకుట కష్టము. (5) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుట ఆలస్యము. (6) అన్య ప్రాంతమునకు పోయిన యెడల లాభము కలదు. (7) ఈ పనిలో హాని ఉన్నది. (8) ఈ సంవత్సరము విశేష హానికరముగా ఉన్నది. శని పూజ చేయండి. (9) ఒక మిత్త్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరుతుంది. (10) బదిలీ జరుగును కాని ఆలస్యము. (11) అవును, ప్రమోషన్’ ఈ సంవత్సరము ఉంది. (12) అప్పు దొరికే అవకాశము లేదు. (13) ఇతను జీవించి ఉండుట సందేహముగా ఉన్నది . (14) పశువు పశ్చిమ దిశగా వెళ్ళినది. వెతికినచో దొరుకును. (15) కొనవచ్చు, లాభము ఉంది.

సింహ చక్ర ఫలితములు:
(1) అవును, ఈ వివాహము లాభదాయకమే . (2) సఫలత కలుగును. (3) వెళ్ళవద్దు. హాని కలుగును. (4) ఇతను విశ్వాసపాత్రుడైన వాడే. (5) పోయిన వస్తువు దొరుకును. (6) పారిపోయిన వ్యక్తి తిరిగి రాడు (7) ఈ స్థలము వదలవద్దు, ఆలస్యముగానైనా లాభము కలుగుతుంది. (8) ఈ పనిలో హాని కలుగనున్నది. (9) ఈ సంవత్సరము మీకు దుఃఖ దాయకము. శనిని పూజించండి. (10) మీ కోరిక పూర్తి అవుతుంది. (11) ప్రస్తుతము బదిలీ అవకాశములు తక్కువ. (12) ప్రమోషన్’ ఈ సంవత్సరము దొరకదు. (13) సమయము బాగు లేదు, అప్పు దొరకదు. (14) ఇతను జీవించే ఉన్నాడు. (15) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. శీఘ్రంగా దొరుకుతుంది

కన్యా చక్ర ఫలితములు:
(1) భాగస్వామ్యంలో లాభం కలదు. (2) ఈ వివాహము మీకు హితకరము. (3) సఫలత సందేహాస్పదంగా ఉంది, రాహువు పూజ చేయండి. (4) ఈ యాత్ర వలన లాభము లేదు. (5) ఇతను నమ్మకమైన వాడు. (6) పోయిన వస్తువు దొరకదు. (7) పారిపోయిన వ్యక్తి ఇప్పట్లో రాదు. (8) అన్య ప్రాంతమునకు పొతే లాభము కలదు. (9) అవును, దిని వల్ల లాభము కలుగును. (10) ఈ సంవత్సరము మీకు లాభదాయకము. (11) మీ కోరిక నెరవేరుతుంది. (12) బదిలీ శీఘ్రముగా జరుగును. తూర్పు దిశగా కావచ్చును. (13) ప్రమోషన్’ దొరికే అవకాశము తక్కువ. (14) ఒక మిత్రుని సహాయముతో అప్పు దొరుకును. (15) ఇతను జీవించి ఉన్నాడు.

తులా చక్ర ఫలితములు:
(1) పుత్రుడు జన్మిస్తాడు. (2) భాగస్వామ్యం వలన లాభము ఉంది. (3) ఈ వివాహము వలన మీకు లాభము కలుగదు. (4) ప్రయత్న పూర్వక సఫలత కలుగనున్నది. (5) ఈ యాత్ర వలన లాభము ఉంది. (6) ప్రతీ వ్యక్తి పైన విశ్వాసము పెంచుకోవద్దు . (7) పోయిన వస్తువు దొరకదు. (8) పారిపోయిన వ్యక్తి వచ్చును, నిరీక్షించి ఉండండి. (9) మీకు ఈ ప్రాంతము లోనే లాభము ఉంది. (10) లాభము ఉంది. (11) ఈ సంవత్సరము మీకు అత్యుత్తమము, సంతోష జనకముగా ఉంది. (12) ఈ యీ కోరిక పూర్తి కానున్నది. (13) బదిలీ సమీప భవిష్యత్తులో ఉంది. (14) పమోషన్ ‘ శీఘ్రంగా కలుగును. (15) ఒక మిత్రుని సహాయము ద్వారా అప్పు దొరుకును.

వృశ్చిక చక్ర ఫలితములు
(1)అవును ఇతను రోగము నుండి విముక్తుడు అవుతాడు. (2)పుత్ర రత్నము కలుగ గలదు. (3)భాగస్వామ్యం వలన హాని కలిగే భయము కలదు. (4) మీకు ఈ వివాహము హితకరము (5) వెళ్లి ప్రయత్నమూ చేయండి, సఫలత కలుగుతుంది. (6) యాత్ర చెయ్యవద్దు. హాని కలుగును. (7) ఈ వ్యక్తిని నమ్మవద్దు. (8) పోయిన వస్తువు దొరికే ఆశ తక్కువ. (9) పారిపోయిన వ్యక్తి తిరిగి వచ్చుటకు ఆలస్యము కలదు. (10) ఈ స్థలము లోనే లాభము కలదు. (11) ఈ పనిలో లాభము కలదు. (12) మీకు ఈ సంవత్సరములో భాగ్యోదయము కలదు. (13) మీ కోరిక నెరవేరదు. (14) ప్రస్తుతము బదిలీ అవదు. (15) ప్రమోషన్’ యోగము రానున్నది.

ధనుష్’ చక్ర ఫలితములు:
(1) పాపము నుండి విముక్తి కలుగును. (2) పథ్యము పాటించక పొతే రోగము తిరుగ బెడుతుంది. (3) ఈ గర్భములో పుత్ర రత్నము జన్మించును . (4) భాగస్వామ్యంలో లాభము తక్కువ. (5) అవును, వివాహము హితకరము. (6) సఫలత సందిగ్ధముగా ఉంది.శని పూజ చేయండి. (7) ఈ యాత్ర వలన హాని కలుగును. (8) ఈ వ్యక్తి విశ్వశనీయత సందేహించ వలసినదిగా ఉంది. (9) పోయిన వస్తువు సురక్షితముగా ఉంది. ప్రయత్నము చేయుము, దొరుకును. (10) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా వచ్చును. (11) ఈ స్థానము లోనే లాభము ఉంది. (12) అవును, ఈ పనిలో హాని ఉంది. (13) మీకు ఈ సంవత్సరము అనేక ప్రకారమైన కష్టములు కలుగ గలవు. (14) మీ కోరిక పూర్తి అవుతుంది. (15) బదిలీ గురించి ఆశించకండి. దుర్గా ఆరాధన చేస్తే ఫలితం కలగవచ్చు.

మకర చక్ర ఫలితములు:
(1) ఒక సత్పురుషుని దర్శనం వలన మీకు కూడా లాభం కలుగుతుంది. (2) ఈ ఆరోపణ నుండి ఆలస్యముగా విముక్తి కలుగుతుంది. (3) అవును, రోగికి నయమవుతుంది. రాహువుకి శాంతి చేయండి. (4) ఈ గర్భస్థ శిశువు కన్యారత్నము అగును. (5) లాభము కలుగును, కాని కొన్ని నెలల సమయము పట్టవచ్చును. (6) ఈ వివాహము మీకు లాభదాయకమే . (7) సఫలత సందేహముగా ఉన్నది, శనికి శాంతి చేయండి. (8) ఈ యాత్రలో హాని జరుగును. (9) అవును, ఇతను నమ్మకస్తుడే. (10) పోయిన వస్తువు దొరకదు. (11) పారిపోయిన వ్యక్తి త్వరలోనే వచ్చును. (12) మీరు అన్య ప్రాంతంలో ప్రయత్నిస్తే లాభము కలుగును. (13) ఈ పనిలో హాని కలుగును. (14) ఈ సంవత్సరము మీకు లాభదాయకమే . (15) ఒక మిత్రుని సహాయము వలన మీ కోరిక నెరవేరును.

కుంభ చక్ర ఫలితములు:
(1) శారీరిక వ్యాధి మాత్రమే . (2) ఈ దినము నానా ప్రకార చింతలు, చికాకులతో గడచును. (3) రాహువునకు శాంతి చేయండి, విముక్తి కలుగుతుంది. (4) పుత్రుడు పుట్టును. (5) ఈ రోగిని బ్రహ్మ బాధ పీడిస్తోంది, తంత్రము ద్వారా చికిత్స చేయించండి. (6) లాభము కన్నా నష్టమే ఎక్కువ. (7) ఈ వివాహము హానికరముగా ఉంది. (8) సఫలత కఠినం, కుజునికి శాంతి చేయండి. (9) ఈ యాత్ర లాభదాయకం. (10) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (11) పోయిన వస్తువు లభించ గలదు. (12) పారిపోయిన వ్యక్తి దూరంగా పోవుచున్నాడు, ఆలస్యముగా తిరిగి చేరును. (13) మీకు అన్య ప్రాంతమునందు లాభము కలుగును. (14) ఈ కార్యములో విజయము కలుగును . (15) ఈ సంవత్సరము మీకు విశేష లాభదాయకము.

మీన చక్ర ఫలితములు:
(1) కొనవచ్చును, లాభము కలుగును. (2) గుప్త రోగముతో పీడింప బడుతున్నాడు . (3) ఈ దినము చింత వ్యథలతో గడచును. (4) విముక్తి కలగుట కష్టము, బుధునికి శాంతి చేయండి. (5) మందులు ఇస్తూనే ఉండండి.రోగము నిమ్మలిస్తుంది శుక్రుని పూజ చేయండి. (6) పుత్రిక పుట్టును. (7) లాభము కలుగ వచ్చును. కాని శనికి శాంతి చేయండి. (8) ఈ వివాహము మీకు హితకరము . (9) సఫలతను పరిశ్రమతో సాధించండి . (10) లాభము కలుగును,యాత్ర సాగించండి. (11) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. (12) పోయిన వస్తువు దొరకుట కఠినం. (13) పారిపోయిన వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. తిరిగి వచ్చుట ఆలస్యమగును. (14) ఈ స్థానమునందే లాభము కలుగును. (15) ఈ పనిలో లాభము మధ్యమము .

సూర్య చక్ర ఫలితములు:
(1) కార్య సిద్ది,కలుగును .కాని ఆలస్యం కాగలదు. (2) కొనండి, లాభము కలుగును. (3) ప్రేత బాధ ఉంది. (4) సత్సంగము వలన లాభము కలుగును. (5) విముక్తి కలుగును.శుక్రునికి శాంతి చేయండి. (6) పథ్యము పాటించక పోతే, రోగము పెరుగును. (7) పుత్రిక పుట్టును. (8) లాభ ప్రాప్తికి కుజుని బాధ కలదు,శాంతి చేయండి. (9) ఈ వివాహము హితకరము . (10) సఫలత నిశ్చయం . (11) యాత్ర చేయవద్దు, హాని కలుగును. (12) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు . (13) పోయిన వస్తువు ఒక స్త్రీ తీసినది, దొరకుట కష్టము. (14) పారిపోయిన వ్యక్తి, ఆలస్యముగా ఇంటికి చేరును. (15) ఈ స్థలము నందే లాభము కలుగును, కొంత కాలము సంతోషముగా గడపండి.

చంద్ర చక్ర ఫలితములు:
(1) మహా దోష రహితముగా ఉంది. (2) కార్యము యథా సంభవముగా జరుగుతుంది. (3) హాని కలుగును. (4) చేతబడి జరిగింది. (5) ఈ దినము సుఖముగా నడుచును. (6) విముక్తి కష్టము, శనికి పూజ చేయండి. (7) రోగము అసాధ్యమని తోచుచున్నది, శనికి శాంతి చేయండి. (8) పుత్రుడు పుట్టును, కాని మొండి పట్టుదల కలవాడు అగును. శనికి శాంతి చేయించండి. (9) భాగస్వామ్యం లాభదాయకమే . (10) ఈ వివాహము హితకరము . (11) సఫలత కలిగే అవకాశము ఉంది. (12) హాని కలుగును, ప్రయాణము చేయవద్దు. (13) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడు కాడు నమ్మవద్దు. (14) పోయిన వస్తువు దొరుకును ప్రయత్నము చేయుము. (15) పారిపోయిన వ్యక్తి ఆలస్యముగా చేరును.

కుజ చక్ర ఫలితములు:
(1) విజయము కలుగుతుంది. కాని గురునికి దాన జపములు చేయండి. (2) ఇంటిలో ఎటువంటి దోషములు లేవు. (3) కార్య సిద్ది కలుగుట యందు సందేహము ఉంది. (4) కొనండి, లాభము ఉంది. (5) గ్రహ బాధ ఉంది. కుజునికి శాంతి చేయండి. (6) ఈ దినము చింతాముక్తి కలుగును. (7) విముక్తి కఠినం, శనికి శాంతి చేయండి. (8) రోగి అవపథ్యము వలన రోగము పెరిగింది. కుజునికి శాంతి చేయండి. (9) పుత్రిక పుట్టును. (10) లాభము కలుగును, భాగస్వామ్యం చేయండి. (11) ఈ వివాహము హితకరము . (12) సఫలత కలుగుట యందు అడ్డంకులు కలవు, కేతువు పూజ చేయండి. (13) యాత్ర వలన హాని కలుగును. (14) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే. 15) పారిపోయిన వ్యక్తి తిరిగి రాదు, వెతకుట వ్యర్థము.

బుధ చక్ర ఫలితములు:
(1) ఈ వార్త నిజమే. (2) కేసు గెలువ గలవు (3) ఈ ఇంటికి చోర భయము ఉంది.రాహువు పూజ చేయుము. (4) కార్య సిద్ది కలుగుట యందు సందేహములు ఉన్నాయి. (5) లాభదాయకంగా ఉంటుంది. (6) ఎవరో చేతబడి చేయించారు. (7) ఈ దినము చింత, వ్యథలతో గడచును. (8) విముక్తి కఠినం . కుజునికి శాంతి చేయండి. (9) రోగము నుండి ముక్తి కష్టము. చంద్రునికి పూజ చేయించండి. (10) పుత్రుడు పుట్టును. (11) పరదేశములో భాగస్వామ్యం చెయ్యండి.లాభము కలుగును. (12) ఈ వివాహము వలన హాని కలుగును. (13) సఫలత చాలా కష్టము. కుజుని పూజ చేయండి. (14) యాత్ర వలన లాభము కలుగును. (15) ఈ ప్రాణి విశ్వాసపాత్రుడే.

గురు చక్ర ఫలితములు:
(1) ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు ఈ కష్టము నుండి విముక్తి కలుగును. (2) ఈ వార్తలో నిజమున్నది. (3) రాహువునకు పూజ చేయించండి, అప్పుడే విజయము సిధ్ధించ గలదు. (4) ఈ ఇంటిలో ప్రేత బాధ కలదు, పాతిపెట్టిన ఎముకలు కూడా ఉన్నాయి. (5) చాల ప్రయత్నము,పొగడతలు,ప్రశంసలు వలన కార్య సిద్ది కలుగును. (6) కొనవద్దు, హాని కలుగును. (7) శారీరిక వ్యాధి కలదు, భయము పెరిగే అవకాశములు ఎక్కువ. (8) చింతించ వలసిన విషయమే. (9) ఆలస్యముగా విముక్తి కలుగ గలదు. చంద్రునికి పూజ చేయండి. (10) అవును ఇతను రోగముక్తుడు కాగలడు. (11) పుత్రిక పుట్టును. (12) స్వప్నమునండు కూడా భాగస్వామ్యం గురించి ఆలోచించ వద్దు. (13) ఈ వివాహము మంచిది కాదు. (14) ప్రయత్న పూర్వక కార్య సిద్ది ఉంది. (15) ఈ యాత్ర వలన సామాన్య లాభము ఉంది.

శుక్ర చక్ర ఫలితములు:
(1) ఈ ఉద్యోగము వలన లాభము ఉంది. (2) అతి కష్టము మీద త్వరలోనే విముక్తి కలుగ గలదు. (3) ఈ వార్త అసత్యము. (4) బుదునికి శాంతి చేయుట వలన విజయము కలుగును. (5) ఈ ఇల్లు నిర్దోషముగా ఉంది. (6) కార్య సిద్ది కలుగుట యందు శని బాధ ఉంది. శాంతి చేయుము. (7) హానికరము కాగలదు, కొనవద్దు. (8) బ్రహ్మ దోషము ఉంది. (9) ఈ దినము సుఖ శాంతులతో గడచును. (10) అతను, విముక్తుడు కాగలడు, సూర్య శాంతి చేయుము. (11) పథ్యము చేయక పోవుట వలన రోగము పెరుగును, విశ్రాంతి దొరకదు. (12) పుత్రుడు పుట్టును, కాని కేతువునకు పూజ చేయుము. (13) భాగస్వామ్యం వలన లాభము కలిగే ఆశ లేదు. (14) ఈ వివాహము హితకరము . (15) సఫలత పొందే ఆశ ఉంది.

శని చక్ర ఫలితములు :
(1) సఫలతా ప్రాప్తి ఉంది. (2) ఈ ఉద్యోగము వలన లాభము ఉంది. (3) సమయము బాగులేదు, రాహువునకు శాంతి చేయుము. (4) ఈ వార్తలో కొంత నిజము ఉంది. (5) విజయము కలుగును. (6) ఇల్లు అశుభము, శని పూజ చేయండి. (7) వైద్యుడు కోపముతో ఉన్నాడు, రోగ ముక్తి కష్టము. (8) కొనవద్దు, హాని కలుగును. (9) భూత బాధ ఉంది. అతి కష్టము.చేత సాధ్యము కాగలదు . (10) ఈ దినము లాభదాయకంగా జరుగును. (11) కేతువునకు శాంతి చేసినచో విముక్తి కలుగును. (12) ఆలస్యముగా మంచి జరుగును. (13) పుత్రుడు పుట్టును, కాని ప్రసవము కష్టము కాగలదు . (14) లాభము ఉంది. భాగస్వామ్యం చేయుము. (15) ఈ వివాహము శుభ ఫలితములు ఇవ్వ గలదు.

రాహు చక్ర ఫలితములు:
(1) ఈ వస్తువును కొనుము, లాభము కలుగును. (2) సఫలత పొందే సంభవము ఉంది. (3) ఈ ఉద్యోగమును నమ్ముకోవద్దు, హాని కలుగ గలదు. (4) ప్రస్తుతము కష్టము నుండి విముక్తి కలుగదు . (5) ఈ వార్త యందు నిజము ఉంది. (6) కేసు బలహీనము, శనికి శాంతి చేయుము. (7) ఈ ఇల్లు సంతాన పక్షములో బాధాకరముగా ఉంది. (8) వైద్యుని వల్ల మీకు అనుకూలత కలగదు. (9) కొనండి, లాభము ఉంది. (10) శారీరిక దోషము ఉంది. విశేష ఉపచారము వలన మంచి కలుగును. (11) ఈ దినము సుఖ శాంతులతో గడుచును. (12) విముక్తి కలుగును, కాని కేతువునకు పూజ చేయండి. (13) రోగముక్తి కష్టము, కుజునికి శాంతి చేయండి. (14) పుత్రుడు పుట్టును,భాగ్యశాలి కాగలడు (15) భాగస్వామ్యం వలన లాభము పొందే అవకాశములు ఎక్కువ.

కేతు చక్ర ఫలితములు:
(1) పశువు దొరుకును, తూర్పు దిశగా వెళ్లినది . (2) కొనండి, లాభము ఉంది. (3) సఫలత కలుగుట యందు సందేహము ఉంది. రాహువునకు పూజ చేయండి. (4) నౌకరీ యందు ఆదాయ వ్యయములు సరి సమానము. (5) అవును, శీఘ్రముగా విముక్తి కలుగును. (6) ఈ వార్త అసత్యము. (7) సమయము బాగు లేదు. రాజీ చేసుకొండి, శనిని పూజించండి. (8) ఈ ఇల్లు ఋణ కారకము . (9) ఈ వైద్యునితో కార్యము కాగలడు. (10) కొనండి, లాభదాయకమే . (11) శారీరిక దోషము, నిదానముగా కుదురును. (12) ఈ దినము చింత, వ్యథలతో గడుచును. (13) విముక్తి కష్టము, కుజుని పూజించండి. (14) అవును, రోగికి త్వరలోనే నయమగును. (15) పుత్రుడు పుట్టును, కాని బుధునికి శాంతి చేయండి.

బ్రహ్మ చక్ర ఫలితములు:
(1) అవును, ఆ ప్రాణి లేక అతను జీవించే ఉంది. (2) పశువు దక్షిణ దిశగా వెళ్లినది. దొరుకుతుంది. (3) ఈ వస్తువు కొంటే హాని కలుగుతుంది. (4) సఫలత పొందగలరు. శనికి శాంతి చేయండి. (5) అవును, నౌకరీ వలన లాభం కలుగుతుంది. (6) సమయం బాగు లేదు, శనికి శాంతి చేయండి. (7) ఈ వార్త అబద్ధము. (8) కేసు దుర్బలము, కుజునికి శాంతి చేయండి. (9) ఇల్లు సమాన్య శుభము. (10) అధికారి వలన కార్యము సిధ్ధించ ఉంది. (11) కొనండి, లాభదాయకంగా ఉంటుంది. (12) ప్రేత బాధ ఉన్నది, రావి చెట్టుకి పూజ చేయండి. (13) చింత, వ్యథలు కలవు, రావి చెట్టుకి పూజ చేయండి. (14) అవును, ఈ ఆరోపణ నుండి విముక్తి పొందుట కష్టముగా ఉంది. (15) నిదానముగా రోగము నయమగును.

విష్ణు చక్ర ఫలితములు:
(1) ఒక మిత్రుని సహాయము వలన అప్పు పొందగలవు. (2) జీవించి ఉంది. (3) పశువు తూర్పు దిశగా వెళ్లింది. దొరికే అవకాశం తక్కువ. (4) లాభం కలుగుతుంది, కొనండి. (5) ప్రతియోగిత పరీక్షలో సఫలత కలుగుతుంది. (6) ఈ ఉద్యోగమునకు స్థిరత్వము లేదు. (7) సమయం బాగు లేదు, విముక్తి ఆలస్యము అగును. (8) ఈ వార్త అబద్ధము. (9) కేసు గెలువగలవు. (10) ఇల్లు శుభము సంశయము లేదు. (11) వైద్యుని ద్వారా రోగము కుదురును. (12) కొనవద్దు, హాని కలుగుతుంది. (13) శారీరిక దోషము, పార్థివ లింగ పూజ చేయండి. (14) ఈ దినము సుఖ,శాంతులతో గడవగలదు. (15) అవును, కొన్ని దినములలో విముక్తి కలుగును.

మహేష్’ చక్ర ఫలితములు:
(1) ఈ సంవత్సరము ప్రమోషన్’ యోగము ఉంది. (2) స్వయముగా అప్పు సాధించ లేవు. (3) జీవించి ఉండుట సందేహము. (4) పశువు దొరుకుట దుర్లభము, దక్షిణ దిశగా వెళ్లినది. (5) కొనండి. లాభము ఉంది. (6) సఫలత పట్ల సందేహము కలదు, శనికి శాంతి చేయండి. (7) నౌకరీ వల్ల హాని కలుగుతుంది. (8) ప్రస్తుతము సమయము బాగు లేదు, కుజునికి శాంతి చేయండి. (9) ఈ వార్త సత్యమైనదే. (10) గెలుపు మీదే అవుతుంది. (11) ఈ ఇల్లు శుభము, మరియు సిద్దిదాయకము అవుతుంది. (12) వైద్యుని వల్ల కార్యము అవుతుంది. (13) కొనవద్దు, హాని కలుగుతుంది. (14) శారీరిక వ్యాధి కలదు, నిదానముగా స్వస్థత కలుగుతుంది. (15) ఈ దినము సుఖము శాంతితో గడుచును.

హనుమాన్’చక్ర ఫలితములు:
(1) కొంత సమయము తరువాత బదిలీ కలుగ గలదు. (2) మీకు ప్రమోషన్’ కలుగుతుంది. (3) ఈ సమయములో అప్పు పుట్టుట సందేహము. (4) అతను జీవించి ఉన్నాడు, కాని రోగ గ్రస్తుడు. (5) పశువు పశ్చిమ దిశగా వెళ్లింది. ప్రయత్నమూ వలన దొరుకుతుంది. (6) కొనవద్దు, హాని కలుగుతుంది. (7) ప్రతియోగిత పరీక్షలలో సఫలత పొందుట అతి కష్టము. (8) ఈ నౌకరీ వలన హాని పొందే అవకాశము ఉంది. (9) కొంత సమయము తరువాత కష్టము నుండి నివారణ కలుగును. (10) అవును, ఈ వార్త నిజమే. (11) కేసు గెలువగలవు. (12) ఈ ఇల్లు శుభముగా లేదు. కేతువునకు శాంతి చేయండి. (13) కార్య సిద్ది ఆశించుట వ్యర్థము కాగలదు. (14) అవును దీనిని కొనండి, లాభము ఉంది. (15) ప్రేతబాధ ఉంది. తంత్రము ద్వారా నివారణ కలుగును.

    ఇక చక్రంలో ప్రశ్న సమాధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం

ఉదాహరణలు సవరించు

ప్రశ్న చక్రము ద్వారా మీరు అడగదలచుకొన్న ప్రశ్నను గుర్తించి, ఆ సంఖ్యను ఒకచోట వ్రాసి ఉంచండి. తరువాత తీసా యంత్రములో ఏదో ఒక గదిలో చేతి నడిమి వ్రేలిని గాని, లేక పెన్సిల్ తో గాని ఒక సంఖ్యని ఎంచుకొని దాని సంఖ్యని మొదట ఉంచిన సంఖ్యతో కలపండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని బట్టి, సమాధాన చక్రమును గుర్తించండి. ఆ చక్రములో తీసా చక్రము ద్వారా ఎంచుకొన్న సంఖ్య ద్వారా మీకు కావలసిన సమాధానము తెలుసుకోండి . మీరు అడిగిన ప్రశ్న నా మనోకామన పూర్తి అవుతుందా లేదా ? దీని సంఖ్య 1 . తీసా చక్రములో ఎంచుకొన్న సంఖ్య 6 అనుకొందాం. ఈ రెండింటి మొత్తం 1+6=7 అయింది. ఇప్పుడు ఏడవ సమాధాన చక్రము అంటే మేష చక్రములో, ఆరవ సమాధానము చూడండి. మనోవాంఛ పూర్తి కాదు అని వచ్చింది.

ప్రశ్న
నేను ప్రతియోగిత పరీక్షలో గెలుస్తానా లేదా?
ప్రశ్న చక్ర సంఖ్య 24 . తీసా యంత్రములో ఎంచుకొన్న సంఖ్య 8 అనుకొండి ఈ రెండింటి మొత్తము 24+8=32 అయింది . ఈ సంఖ్య 30 కన్నా ఎక్కువ కదా ! అందు వలన అందులో నుంచి 30 తీసివేయాలి. 32 -30=2 అయింది రెండవ సమాధాన చక్రము, అగ్ని చక్రములో ఎంచుకొన్న సంఖ్య ఎనిమిదవ సమాధానం చూడండి. ``సఫలత కలుగుతుంది, కాని కుజుని పూజించండి.’’ అని ఉంది.
*********************

ఋషిపంచమి

సప్తఋషిభ్యో నమః 🙏🏼

భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.

అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి.

ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

🌼 సప్తఋషి ధ్యాన శ్లోకములు 🌼
   
కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||
   
అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||    ఓం అనసూయా సహిత అత్రయేనమః||
   
భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||
   
విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||     ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||
   
గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||    ఓం అహల్యా సహిత గౌతమాయనమః||
   
జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
   
వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||    ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||
*****************

భగవద్గీత చదవండి

భగవద్గీత
(నాకు నేనే శత్రువు ! నాకు నేనే మిత్రుడు!).....
....
మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
.
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
.
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
.
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
.
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
.
 తరువాత?
.
 మెసపొటేమియా!
.
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
.
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
.
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
.
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,

రా! నా ప్రక్కన పడుకో!
.
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!
.
అని అడిగాడు!..డియోజినస్.
.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
.
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు!
.
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
.
Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
.
ఒక మనిషికి ఎంతకావాలి?
.
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా?
.
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!...
.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
.
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
.
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
.
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
.
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
.
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
.
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
.
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
.
That path is as sharp as Razor's edge.....
.
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
.
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
.
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
.
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
.
అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
..
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః......
.
భగవద్గీత చదవండి ! చదివించండి!
****************

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

16.1 (ప్రథమ శ్లోకము)

ఏవం పుత్రేషు నష్టేషు దేవమాతాదితిస్తదా|

హృతే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవత్॥6896॥

శ్రీశుకుడు వచించెను - "పరీక్షిన్మహారాజా! దేవతలు ఈ విధముగ స్వర్గమునుండి పారిపోయి దాగికొనగ దైత్యులు స్వర్గాధిపత్యమును పొందిరి. అంతట దేవమాతయైన అదితి అనాథవలె మిగుల దుఃఖించెను".

16.2 (రెండవ శ్లోకము)

ఏకదా కశ్యపస్తస్యా ఆశ్రమం భగవానగాత్|

నిరుత్సవం నిరానందం సమాధేర్విరతశ్చిరాత్॥6897॥

"ప్రజాపతియైన కశ్యపుడు చాలదినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొనెను. అప్పుడప్ఫుడతడు అదితి ఆశ్రమమునకు ఏతెంచెను. అచట సుఖశాంతులుగాని, ఏవిధమైన ఉత్సాహముగాని,…

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

649వ నామ మంత్రము

ఓం అదృశ్యాయై నమః

దర్శింప వీలుకాని సత్, చిత్, ఆనందం అను ఈ మూడు లక్షణములు కలిగి, అదృశ్యా అను నామముతో వశిన్యాదులచే స్తుతింపబడిన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అదృశ్యా యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును  ఓం అదృశ్యాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగదీశ్వరిని ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి భక్తికి సంతసమంది సర్వాభీష్టములను సిద్ధింపజేసి, ఆత్మసాక్షాత్కారము కలిగించి తరింపజేయును.

పంచ లక్షణములైన అస్తి, భాతి, ప్రియం, రూపం నామం అను వాటిలో మొదటి మూడు పరమాత్మ లక్షణములు. ఈ మూడు లక్షణములే సత్, చిత్, ఆనందము అంటారు. ఈ లక్షణములు గల పరమాత్మ దృగ్గోచరము కాదు. అనగా ఈ చర్మచక్షువులతో చూడలేము.  కంటికి చూపు, చెవులకు వినికిడి, మిగిలిన ఇతర ఇంద్రియములకు ఆయా లక్షణములను ప్రసాదించునది ఆ పరమాత్మయే.  మనకున్న ఇంద్రియాలతో పరమాత్మ  గురుంచి తెలుసుకోలేము, కంటితో చూడలేము. అందుకే ఆ పరమేశ్వరి అదృశ్యా అను నామ మంత్రముతో  వశిన్యాదులచే ప్రస్తుతింపబడినది. ఇంతకు ముందు నామంలో ఆ జగన్మాతను లీలాక్లప్త బ్రహ్మాండ మండలా అని స్తుతించాము. అంటే బ్రహ్మాండాలన్నీ ఆ తల్లి చేతే సృష్టింపబడుతాయి, తనలోనే ఇముడుతాయి అని. అంటే ఎవరు ఆ తల్లిని చూడగలరు? ఒక్కరైనా చూడగలరా? చర్మచక్షువులతో, సామాన్యులకు అదృశ్య కదా ఆ తల్లి. చూడగలరు. చూసినట్లు భావించగలరు. ఎవరైతే మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథిని ఛేదించుకుంటూ, షట్చక్రములు దాటి, సహస్రారం చేరి అక్కడ అమ్మ కురిపించే సుధామృత  ధారలలో (సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ) తడిసిముద్దయిన సాధకుడు మాత్రమే అమ్మను చూశానని తృప్తినందుతాడు. గాన సాధకేతరులెవ్వరికైనా ఆ తల్లి అదృశ్యా అని మాత్రమే భావించాలి.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం అదృశ్యాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

72వ నామ మంత్రము

ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః

భండుని, భండుని సైన్యాన్ని .వధించుటకు ఉద్యుక్తులయిన శక్తి సైన్యముల పరాక్రమాన్ని చూసి ఆనందించిన తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిప్రపత్తులతో ఆ అఖిలాండేశ్వరిని   ఉపాసించు సాధకునకు అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని ప్రసాదించి భౌతికపరంగా కూడా సుఖసంతోషములతో జీవనం కొనసాగించి అంత్యమున పరమపదమును కటాక్షించును.

భండాసురుడు జీవాత్మ, పరమాత్మ రెండుగా భావించే అజ్ఞాని. అంతకన్నా కౄరుడు. అసుర ప్రవృత్తి గలవాడు. అహంభావి. అంటే పాంచభౌతిక శరీరమే నేను అనే మూర్ఖుడు. అరిషడ్వర్గములకు లొంగిపోయిన వాడు. ఈ జగత్తు, ఈ
శరీరమే నిత్యమని భావించేవాడు. యథా రాజా తథా ప్రజా కదా అంటే తమ ప్రభువైన భండుడే అలాంటివాడయితే అతని సైన్యం మాత్రం అందుకు తీసిపోతారా? వారు అదే ప్రవృత్తి గలవారు. నిజానికి ద్వైదీభావన (జీవుడు, దేవుడు రెండు అను భావన), అరిషడ్వర్గములను, అహంకారము (నేను అంటే ఈ శరీరమే అను తత్త్వము) ఇలాంటి బాహ్యవృత్తులను నశింపజేసి వాటితో పూర్తిగా కలుషతమైన మనస్సును ప్రక్షాళనము చేయాలి. అప్పుడు స్వస్వరూప జ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞాని ముక్తుడవుతాడు. అందుకు భండుడనే బాహ్యప్రవృత్తిని నాశనం చేయడానికి పరమేశ్వరి సైన్యమనే అద్వైతశక్తులు ఉద్యుక్తులయాయి. అటువంటి సేనలను చూసి పరాశక్తి మనసు హర్షాతిరేకముతో నిండిపోయింది. అటువంటి తల్లికి వశిన్యాదులు జగన్మాతకు ఇచ్చిన అనంతకోటి నామాలలో  భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా కూడా ఒక నామమును చేర్చి, ఒక మహామంత్రముతో సమానముచేసి జగన్మాతను ప్రస్తుతించారు. అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని అనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది. శ్రీలలితా సహస్రనామ తత్త్వవిచారణ (శ్రీలలితా సహస్రనామములకు భాష్యము)  అను గ్రంథము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, (జడ్చర్ల) శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి తపోవనం ఆశ్రమంలో లభించును.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻నేడు ఆది (భాను) వారము🌹🌹🌹ఆదివారమునకు దినాధిపతి సూర్యుడు🌻🌻🌻సూర్య వంశమునకు చెందిన రఘురాముని ఆరాధించు శుభదినము🌹🌹🌹ఓం నమో రామభద్రాయ🕉🕉🕉ఓం శ్రీసూర్యనారాయణాయ నమః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము

పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అదితిరువాచ

16.11 (పదకొండవ శ్లోకము)

భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ|

త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహా ఇమే॥6906॥

అదితి పలికెను "మహాత్మా! ద్విజులు, గోవులు, ధర్మము మరియు ఈ దాసి అందరమూ కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థకామముల సాధనయందు పరమ సహాయకము.

16.12 (పండ్రెండవ శ్లోకము)

అగ్నయోఽతిథయో భృత్యా భిక్షవో యే చ లిప్సవః|

సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్న రిష్యతి॥6907॥

ప్రభూ! నిన్ను నేను నిరంతరము స్మరించుచునే యుందును. మరియు నీ క్షేమమునే కోరుచుందును. కనుక నేను అగ్నులను, అతిథులను, సేవకులను, మరియు యాచకులను  యథాశక్తిగా ఆదరించి, సత్కరించితిని.

16.13 (పదమూడవ శ్లోకము)

కో ను మే భగవన్ కామో న సంపద్యేత మానసః|

యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే॥6908॥

స్వామీ! నీవంటి ప్రజాపతి ధర్మపాలనయందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరికయైనను ఎట్లు తీరకుండును.

16.14 (పదకొండవ శ్లోకము)

తవైవ మారీచ మనఃశరీరజాః ప్రజా ఇమాః సత్త్వరజస్తమోజుషః|

సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః॥6909॥

ఆర్యా! సత్త్వరజస్తమోగుణములు గల ప్రజలందరును నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమైరి. అసురులు, దేవతలు అందరును నీ సంతానమే. అందరియెడ నీవు సమభావమున ఉందువనుటలో ఎట్టి సంశయమూలేదు. ఐనను సాక్షాత్తు పరమేశ్వరుడు గూడ తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును.

16.15 (పదునైదవ శ్లోకము)

తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత|

హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో॥6910॥

16.16  (పదునారవ శ్లోకము)

పరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే|

ఐశ్వర్యం శ్రీర్యశః స్థానం హృతాని ప్రబలైర్మమ॥6911॥

స్వామీ! నేను నీకు దాసిని నీవునా శ్రేయస్సునుగూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను, నివాస స్థానములను గూడ లాగుకొనిరి. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును గూడ హరించిరి. మమ్ములను మా ఇళ్ళనుండియే వెళ్ళగొట్టిరి. అందువలన నేను దుఃఖసాగరములో మునిగియున్నాను.

16.17 (పదునేడవ శ్లోకము)

యథా తాని పునః సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః|

తథా విధేహి కల్యాణం ధియా కల్యాణకృత్తమ॥6912॥

మహాత్మా! నీవు తప్ప మా యశస్సును కోరెడివారు ఎవరున్నారు? నీవు నా హితైషివి. కనుక, నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును  ఆలోచించును. ఆ విధముగా నాకు శుభములను చేకూర్చును".

శ్రీశుక ఉవాచ

16.18 (పదునెనిమిదవ శ్లోకము)

ఏవమభ్యర్థితోఽదిత్యా కస్తామాహ స్మయన్నివ|

అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్॥6913॥

16.19 (పందొమ్మిదవ శ్లోకము)

క్వ దేహో భౌతికోఽనాత్మా క్వ చాత్మా ప్రకృతేః పరః|

కస్య కే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణమ్॥6914॥

శ్రీశుకుడు వచించెను అదితి కశ్యప ప్రజాపతిని ఇట్లు ప్రార్థింపగా అతడు దరహాసము చేయుచు ఆమెతో ఇట్లనెను- "ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తు అంతయు మోహపాశముతో బంధింపబడి యున్నది పంచభూతములతో నిర్మింపబడిన, అనాత్మయైన ఈ దేహమెక్కడ? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడ? ఎవరికి ఎవ్వరును పతిగాని, పుత్రుడుగాని, బంధువుగాని కారు. ఈ అందరినీ మోహమే ఆడించుచున్నది.

16.20 (ఇరువదియవ శ్లోకము)

ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనమ్|

సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుమ్॥6916॥

16.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

స విధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః|

అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ॥6916॥

దేవీ! ఆ పరమపురుషుడు సకల ప్రాణుల హృదయములయందు విరాజిల్లు చుండువాడు. తన భక్తుల  దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు, భగవంతుడు ఐన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీనదయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడును వ్యర్థముకాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటె మరియొక ఉపాయము లేనేలేదు'.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319


--

పద్యాలూ

కుదువంబెట్టినపట్టుచీరె చదువన్గూర్పంగశ్రద్ధన్ గురుల్
సదయుండాహనుమంతుడే బహువిధాసక్తుల్ మదిందీర్ప తా
నెదిరిం లెక్కయొనర్పనట్టి దృఢతే నిన్విశ్వమేమెచ్చగా
కొదమంసింగముజేసె సైమనును ఢీకొట్టం బ్రకాశాహ్వయా!

త్యాగమె నిజరూపముగా
యోగమ్మేన్యాయవాదనోద్యోగము, గాం
ధీ గమనమె నీబాటగ
సాగిన ధీరా ప్రకాశ సార్థకనామా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

లోకులు కాకులు....

.ఒక వూరులో ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి.

ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే.. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో వున్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది.

ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా..

మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే విషయం చేర్చలేదు.

ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ' అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు అన్ని ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.

వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే.. పాపం.. రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను' అంటూ వాపోయింది. మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూగ భావంగా తలలు తిప్పుకున్నాయి.

కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులు తున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

"ఒక్కోసారి అంతే.. మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాప నిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి వందల మంది నీకేలా.." అంటూ ఓదార్చింది కొమ్మమీద ఒక కోయిలమ్మ..

సూక్తి... ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం, పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని  గ్రహించాలి...

అందుకే.. లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే రాలేదు సుమీ.
*****************

పూర్వ భారతము



కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం * మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
* దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్ See* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్య ాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
********************