Thursday, July 22, 2010

రామకృష్ణ పరమహంస

శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక హిందూ మత గురువు. 19 శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. ఆయన బోధనలు భగవంతుని గ్రహించుట యే జీవితపు పరమార్థమని, భగవంతుని పట్ల ప్రేమ, భక్తి , సృష్టి లో ఏకత్వము మరియు సర్వమత సౌభ్రాతృత్వమును భోదించుచున్నవి.

శ్రీరామకృష్ణ పరమహంస గారు అంటే తెలియని ఆస్తిక భారతీయులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామివివేకానంద వెనుకగల కర్త, కర్మ, క్రియ అంతా శ్రీరామకృష్ణులే.

విషయ సూచిక

[దాచు]

[మార్చు] జీవిత చరిత్ర

భారత దేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు మరియు ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకనిదే చాలా విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. [1] అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించెను.

[మార్చు] బాల్యము

[మార్చు] జననము మరియు బాల్యము

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ. 1836,ఫిబ్రవరి 18 పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గధాధరుడు ఆందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనము లో గల ప్రవేశము వలన వారి గ్రామములో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్దగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.


ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి బిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించినది. బ్రాహ్మణుని వద్దనే మొదటి బిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడాని ప్రశ్నించెను. చివరికి ఆతని గరిష్ట సోదరుడు రామ్కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.


ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది. రామ్కుమార్ కలకత్తా లో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్కుమార్ దానికి అంగీకరించెను. కొంత ప్రోద్బలముతో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకొనెను. రామ్కుమార్ రిటైరయిన తరువాత రామకృష్ణుడు పూజారిగా భాధ్యతలను తీసుకొనెను.

[మార్చు] పూజారి జీవితము

మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.

[మార్చు] గురువులు మరియు సాధనలు

కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు[2]. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.

[మార్చు] వైవాహిక జీవితము

కామార్కపూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లి తో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతల లో పడగలడని చెప్పిరి. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దీరము లో ఉన్న జయరాంబతీ గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవి తో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తి గా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు. ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిశ్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువు గా మారెను.

[మార్చు] గురువుగా

చూడండి: en:Apostles of Ramakrishna

తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంస గా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని అకర్షించేవారని ప్రతీతి. పదిహేను సంవర్సరములు మతములలో మూల సత్యములను కథలు, పాటలు, ఉపమ అలంకారములు, అన్నిటి కంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రభోదించెను.


తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగినది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవత్ అనుభవమ్ పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. "మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆద్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.

రామకృష్ణులు ప్రపంచానికి అందించిన శిష్యులు

స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తురీయాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుభోదానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిర్గుణానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా(), పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.

[మార్చు] తరువాత జీవితము

వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు.తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్ కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు.చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 16 ఆగష్టు, 1886 మహాసమాధిని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ది పొందెను. రామకృష్ణుని సమకాలికుల లో కేశవ చంద్ర సేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆతని అరాధకులు

[మార్చు] భోదనలు

రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు.

[మార్చు] భగవత్తత్వము

  • సృష్టి లో ఏకత్వము
  • అన్ని జీవులలో దైవత్వము
  • ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
  • మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
  • మానవసేవే మాధవసేవ
  • ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.

అలాగే స్వామీ వివేకానందుని భోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5e/Ramakrishna_at_studio.jpg/200px-Ramakrishna_at_studio.jpg

Ramakrishna (1881, Calcutta)

రామకృష్ణుడు జీవితము లో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కణించెను. మతము కర్తవ్యము ని నిర్వర్తించుటకు మటుకే నని ఆతని అభిప్రాయము. [3]. రామకృష్ణుని భావగర్బిత మైన అత్మజ్ఞానము ను హిందూ మతము లో నిర్వికల్ప సమాధి గా నిర్వచించిరి. నిజానికి 'నిత్య ధ్యానము' (అనగా సృష్టి లో సర్వ వ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట), అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి భాషా చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. ఋగ్వేదము లో నిర్వచించిన సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామముల తో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని భోదన ఏకీభవిస్తున్నది. భావన వలన రామకృష్ణుడు తన జీవితకాలము లో కొంత భాగము తన కు అర్థమైన రీతి లో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతము లోని యోగ, తంత్ర శాస్త్రము లు అభ్యాసము చేస్తూ గడిపేవారు.

[మార్చు] అవిద్యామాయ మరియు విద్యామాయ

చూడండి: en:Avidyamaya and vidyamaya

రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయ ను అర్థము చేసుకొన్నారని భావించేవారు. అవిద్యామాయ లో దుష్టశక్తులు (కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము) మానవ జీవితము ను జన్మ, మృత్యువుల కర్మ చక్రము లో బంధించి, చేతన(consciousness) ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మ చక్రము లో బందిస్తున్న శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయ లో ఉన్నత శక్తులు (అధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు, , దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి) మానవులను చేతన లో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతున్నవి. విద్యామాయ సహాయము తో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతుని గా మారవచ్చని భోదించేవారు.

[మార్చు] ఇతర భోధనలు

రామకృష్ణుని నిర్వచనము ఎక్కడ జీవశక్తి ఉండు నో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును.

రామకృష్ణుడు కి పుస్తక జ్ఞానము అంతగా లేకపోయినప్పటికీ , క్లిష్టమైన తత్త్వ శాస్త్ర ఆంశాలను ఒడిసి పట్టుకునే నేర్పు మాత్రము కలదు. .[4]. అతని ప్రకారము బ్రహ్మానందము, కనపడే విశ్వము, కనపడని విశ్వము, అనంత వ్యాప్తమైన బ్రాహ్మన్ నుండి వస్తున్న బుడగలు [5].

ఆది శంకరాచార్యులు వలే రామకృష్ణ పరమహంస, హిందూ మతము లో పేరుకు పోయిన అధిక సాంప్రదాయములు,మూఢ నమ్మకాలను 19 శతాబ్దము లో కొంతవరకూ తొలగించి, హిందూ మతముని నవీన శకము లో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్ళకు దీటైన పోటీగా నిలబెట్టారు.[6]. అతని వలన భక్తి ఉద్యమము, [అరబిందో] కుడా ప్రభావితమయ్యెను.

[మార్చు] రామకృష్ణుని ప్రభావము

భారతీయ తత్త్వ శాస్త్రము మొత్తం భారతదేశము లో ముఖ్యముగా బెంగాల్ లో సమాజ ఉద్దరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము దిశలో ముఖ్య భూమిక వహించి తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది.

[మార్చు] హిందుత్వము పై

బెంగాల్ పునరుజ్జీవనం రామకృష్ణుని జీవితము, ఆతని కృషి వలన పుట్టింది అని చెప్పవచ్చు. బ్రహ్మసమాజ్,ఆర్యసమాజ్ లు రామకృష్ణ మిషన్ కంటే ముందునుండి ఉన్నపటికీ వాటి ప్రభావము రామకృష్ణుని ముందు సమాజము పై పెద్దగా ఉందేది కాదు. రామకృష్ణుని వలన పరిస్థితి నాటకియంగా మారిపోయింది. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసము ఇవ్వడము ద్వారా [[రామకృష్ణ మిషన్] ను స్వయముగా ప్రారంభించెను. స్వామీ వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింప చేసెను.

19 శతాబ్దము లోహిందుత్వము ఒక పాశ్చాత్యులకే గాక హిందువులకు కూడా ఒక పెద్ద మనోసంధమైన సవాలు గా నిలిచింది. విగ్రహారాధన బుద్ది తో కూడుకున్నది కాదని బ్రిటిష్ సామ్రాజ్యము లో బెంగాల్ లో చాలామంది భావించేవారు. సవాలుకు జవాబుగా యువ బెంగాల్ ఉద్యమము హిందుత్వాన్ని నిరసించి క్రైస్తవ మతమును నాస్తికత్వమును ప్రోత్సహించింది. బ్రహ్మసమాజ్ విగ్రహారాధన ను నిరసిస్తూ హిందూ మతము లో ప్రధాన సిద్దాంతములను, బంకిమ్ చంద్ర చటర్జీ దృడమైన హిందూ జాతీయ భావము తో పాటు ప్రోత్సహించింది.రామకృష్ణుని ప్రభావము వలన, శతాబ్దముల పూర్వము ఇస్లాం మత ప్రభావము దృడముగా ఉన్నపుడు చైతన్యుడు కృషి వలే, సాంప్రదాయ హిందూమతము మళ్ళీ ఊపిరి పోసుకుంది.[7]

హిందూ మతము పై రామకృష్ణుని ప్రభావము ఇక్కడ వరకూ ఉంది అని ఖచ్చితముగా చెప్పడము కష్టము కావచ్చు కాని కొన్ని ముఖ్యమైన ప్రభావాలను గుర్తించవచ్చును. కాళీ మాత విగ్రహము ను పూజించేటప్పుడు, విగ్రహారాధన లో మూల సిద్దాంతమును రామకృష్ణుడు ప్రశ్నించేవాడు -- పూజించేది నిజము దేవతను అయితే ఆమెఎందుకు పలకడము లేదు? ఆయనకు ఎన్నో దివ్యానుభూతులు కలిగి కాళీమాత ఉన్నదని అర్థమైనది.[8][9]. రామకృష్ణుని గౌరవించే వారందరికి దీని వలన శతాబ్దాలుగా ఉన్న విగ్రహారాధన, ఇతర ఆచారముల పై నమ్మకము పెరిగింది. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదమును ప్రతీ అధిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుంది ప్రతిపాదించెనను. అయన స్వయముగా విష్ణుమూర్తి అవతారములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లను పెట్టుకొని, కాళీ, దుర్గా మాతల భక్తుడై ఇస్లాం, క్రైస్తవ మతముల తో పాటు తంత్ర శాస్త్రమును కుడా అభ్యసించెను.

[మార్చు] భారత జాతీయత

పెరుగుతున్న భారత జాతీయత పై రామకృష్ణుని ప్రభావము పరోక్షముగా ఉన్నపటికీ గుర్తించదగినది. కాలము లో చాలా మంది జ్ఞానులు రామకృష్ణుని తో నిత్యము సంభాషిస్తూ ఉండేవారు. అతని తో కొంతమంది మతపరమైన విషయాలలో ఏకీభవించనప్పటికీ చాలా గౌరవిస్తూ ఉండేవారు. భారతీయ నాగిరికత పై బ్రిటిష్ వారి ఆక్రమణ ను ఎదిరించే శక్తిని అతని లో గమనించేవారు. అమౌరీ దీ రెన్కోర్ (Amoury de Riencourt)ఇలా అన్నారు "20 శతాబ్దపు గొప్ప నాయకులు వారి జీవనశైలి ఏదైనా కాని, రవీంద్రనాథ్ టేగొర్-కవి రాజకుమారుడు, అరబిందో ఘోష్-గొప గూఢ తత్త్వవేత్త, మహాత్మా గాంధీ-బ్రిటిష్ వారి ఆక్రమణను కూకటి వేళ్ళతో సహా పెకిలించిన మహానీయుడు కూడా వారి వారి ఋణమును రామకృష్ణునికి (భారతీయుల హృదయాన్ని కుదిపేసినందుకు), వివేకానందునకు(భారతీయుల ఆత్మను జాగృతము చేసినందుకు) అంగీకరించారు"."[10] అమ్మతో పోల్చడము వలన రామకృష్ణుని తో పెరిగి జాతీయ ఉద్యమంలో భారతమాత గా భూమిక వహించింది.[11]

[మార్చు] వివేకానంద, రామకృష్ణమఠము, రామకృష్ణ మిషన్

ప్రధాన వ్యాసం: రామకృష్ణ మఠము

వివేకానంద రామకృష్ణుని ముఖ్య వారసుడిగా పరిగణించబడతాడు. వివేకానందుడు రామకృష్ణుని సందేశాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేసెను. హిందూమతమును పశ్చిమదేశాల లో పరిచయము చేసెను. రామకృష్ణుని బోధనల మేరకు రెండు సంస్థలను స్థాపించెను.

  1. రామకృష్ణ మిషన్‌: రామకృష్ణుని భోదనలను ప్రపంచము లో ప్రచారము చెయ్యుటకు
  2. రామకృష్ణ మఠము: సన్యాసుల పరంపరను కొనసాగించుటకు


రామకృష్ణా మిషన్ తమను హిందేతర మైనారిటీ మతముగా గుర్తించవలెనని 1980 లో కోర్టుకు వెళ్ళగా వారి కేసు కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులలో కొట్టివేయడమైనది.[12]. వారు రాజ్యాంగము మైనారిటీ మతములకు ఇచ్చిన సౌకర్యములను పొందడానికి ప్రయత్నించారు. (ఉదాః అధికరణము 30.(1)వారి విద్యా సంస్థల పై ఎక్కువ అధికారములు ఇస్తుంది.)

[మార్చు] సమకాలీన ప్రభావం

హిందూమతము పై రామకృష్ణుని ఆలోచనలు(విజన్), హిందూమతము ను ప్రచారము చేసిన క్రిష్టోఫర్ ఇషర్వుడ్ లాంటి మతము మార్చుకున్న (కన్వర్ట్స్)పాశ్చాత్య దేశవాసులు, పాశ్చాత్య దేశాల వారి హిందూమతము పై అభిప్రాయాలను ప్రభావితం చేసారు. కొంతమంది అండ్రూ హర్వే మరియు కెన్ విల్బర్ వంటివారు రామకృష్ణుని జీవితముతో కొత్త గ్రహ చేతన వచ్చింది ఆంటారు.

1991 లో నరసింఘ సిల్ రామకృష్ణుని గురించి వ్రాస్తూ రామకృష్ణుని దివ్యానుభూతులు శారిరిక మైనవని బాల్యంలో లైంగిక వేధింపుల వలన వచ్చాయి అన్నాడు. [13] మిగతా పండితులు, ముఖ్యంగా మానసిక శాస్త్రజ్ఞుడు సుధీర్ కాకర్, సిల్ అధ్యయనాన్ని మరీ సరళమై తప్పుదీవ పట్టిస్తాందని నిర్థారించాడు. కాకర్ ఒక మెటా సైకలాజికల్ [14], వ్యాధి సంబంధమైనది కాకుండా (నాన్-పేథొలాజికల్) ఉన్న వ్యాఖ్య, ప్రీ-ఓడిపల్ మరియు లేన్కానియన్ రియల్ తత్త్వము లో ఉండి రామకృష్ణుని నిగూఢమైన noesis ను సృజనాత్మకత తో కలిపే వివరణను కోరారు.

[మార్చు] ప్రవచనాలు

  • జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
  • మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
  • భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.

బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.

కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.

No comments: